ETV Bharat / sports

భారత్​లో 2021 టీ20 ప్రపంచకప్

author img

By

Published : Aug 7, 2020, 8:11 PM IST

Updated : Aug 7, 2020, 8:49 PM IST

భారత్​లో 2021 టీ20 ప్రపంచకప్
భారత్​లో 2021 టీ20 ప్రపంచకప్

20:09 August 07

భారత్​లోనే 2021 టీ20 ప్రపంచకప్

ఈ ఏడాది అక్టోబర్-నవంబర్​లో ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సి ఉన్న టీ20 ప్రపంచకప్ కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే వచ్చే సంవత్సరం భారత్​లో జరగాల్సి ఉన్న 2021 టీ20 ప్రపంచకప్ యథావిధిగా జరగనుంది. ఈ ఏడాది వాయిదా పడ్డ టోర్నీని 2022లో ఆస్ట్రేలియా వేదికగా నిర్వహించనున్నారు. నేడు జరిగిన ఐసీసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

అలాగే వచ్చే ఏడాది జరగాల్సి ఉన్న మహిళల ప్రపంచకప్​ 2022కు వాయిదా పడింది. ఆ ఏడాది మార్చిలో ఈ టోర్నీ నిర్వహించనున్నట్లు ఐసీసీ తెలిపింది.

భారత్​ 2023 వన్డే ప్రపంచకప్​కు కూడా ఆతిథ్యం ఇస్తోంది. ఇంతకుముందు 2011లో జరిగిన మెగాటోర్నీని శ్రీలంక, బంగ్లాదేశ్​లతో కలిసి నిర్వహించింది ఇండియా. ఈ టోర్నీలో ఫైనల్లో శ్రీలంకపై గెలిచి విశ్వవిజేతగా నిలిచింది ధోనీసేన.

Last Updated :Aug 7, 2020, 8:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.