ETV Bharat / sports

గబ్బా టెస్టు: విజయానికి 245 పరుగుల దూరంలో భారత్​

author img

By

Published : Jan 19, 2021, 7:40 AM IST

గబ్బా టెస్టులో టీమ్​ఇండియా అదరగొడుతోంది. చేతిలో ఇంకా 9 వికెట్లు ఉండగా.. విజయానికి 245 పరుగుల దూరంలో నిలిచింది. భోజన విరామానికి వికెట్​ కోల్పోయి 83 పరుగులు చేసింది. క్రీజులో శుభ్​మన్​ గిల్​(64), పుజారా(8) ఉన్నారు.

rohith
రోహిత్​

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నిర్ణయాత్మక నాలుగోటెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆచితూచి ఆడుతోంది టీమ్​ఇండియా. 328 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌.. చివరి రోజు ఆటలో తొలి సెషన్ పూర్తయ్యేసరికి వికెట్​ కోల్పోయి 83 పరుగులు చేసింది. ఫలితంగా భారత్ విజయానికి​ మరో 245 పరుగుల దూరంలో ఉంది.

ఓవర్​నైట్​ స్కోరు 4/0తో ఐదో రోజు ఆటను కొనసాగించిన భారత్.. ​ఇన్నింగ్స్​ ఆరంభంలోనే తొలి వికెట్​ను సమర్పించుకుంది. జట్టు స్కోరు 18 పరుగుల వద్ద రోహిత్‌ శర్మ(7) తొలివికెట్‌గా వెనుదిరిగాడు. కమిన్స్‌ బౌలింగ్‌లో రోహిత్.. వికెట్​‌ కీపర్‌కు చిక్కాడు. క్రీజులో గిల్​(57), పుజారా(8) ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.