ETV Bharat / sports

ముస్తాక్​ అలీ టోర్నీ ఏర్పాట్లపై గంగూలీ ఆరా!

author img

By

Published : Dec 31, 2020, 10:48 AM IST

క్రికెట్​ అసోసియేషన్​ ఆఫ్​ బంగాల్​ (సీఏబీ) ఆధీనంలోని ఈడెన్​ గార్డెన్స్​ను బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్​ గంగూలీ సందర్శించారు. సయ్యద్​ ముస్తాక్​ అలీ టోర్నీ నిర్వహణకు జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు.

Ganguly visits Eden Gardens, discusses preparations for Syed Mushtaq Ali Trophy
ముస్తాక్​ అలీ టోర్నీ ఏర్పాట్లపై గంగూలీ ఆరా!

భారత క్రికెట్​ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్​ గంగూలీ బుధవారం ఈడెన్ గార్డెన్స్​ స్టేడియాన్ని సందర్శించారు. సయ్యద్​ ముస్తాక్​ అలీ ట్రోఫీ కోసం క్రికెట్ అసోసియేషన్​ ఆఫ్​ బంగాల్​ (సీఏబీ) చేస్తోన్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా సీఏబీ అధ్యక్షుడు అవిషేక్​ దాల్మియాతో పాటు సెక్రటరీ స్నేహాషిస్​ గంగూలీ, జాయింట్​ సెక్రటరీ దేవవ్రత దాస్​తో దాదా మాట్లాడారు.

ముస్తాక్​ అలీ టోర్నీ కోసం బంగాల్​ టీమ్​ ఎలా సన్నద్ధమవుతుందనే విషయంపై ఆ జట్టు కోచ్​ అరుణ్​ లాల్​ను గంగూలీ అడిగి తెలుసుకున్నారు. బంగాల్​ టీమ్​లోని ఆటగాళ్లతో కొద్దిసేపు ముచ్చటించారు.
ఆ జట్టుతో సంతృప్తి..
ఈ టీ20 ఫార్మాట్​ కోసం బంగాల్​ జట్టు తీవ్రంగా శ్రమిస్తోందని టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ వీవీఎస్​ లక్ష్మణ్​ అన్నారు.

Ganguly visits Eden Gardens, discusses preparations for Syed Mushtaq Ali Trophy
వీవీఎస్​ లక్ష్మణ్​

"నాకు తెలిసి ఈ టోర్నీ కోసం బంగాల్​ ఆటగాళ్లు బాగా సన్నద్ధమవుతున్నారు. ఆ జట్టు బ్యాట్స్​మెన్​ బంతిని కొట్టే తీరుతో నేను సంతృప్తిగా ఉన్నా. పొట్టి ఫార్మాట్​కు అలవాటు పడేందుకు ఆ టీమ్​కు బంగాల్​ టీ20 ఛాలెంజ్ ఉపయోగపడింది. ఈ అనుభవంతో బంగాల్​ జట్టు ట్రోఫీని దక్కించుకుంటుందని ఆశిస్తున్నా".

- వీవీఎస్​ లక్ష్మణ్​, టీమ్ఇండియా మాజీ క్రికెటర్​

సయ్యద్​ ముస్తాక్​ అలీ ట్రోఫీలోని నాకౌట్​ మ్యాచ్​లను అహ్మాదాబాద్​లోని మోతేరా స్టేడియంలో నిర్వహించనున్నారు. అంటే టోర్నీలోని క్వార్టర్​ ఫైనల్స్​ (జనవరి 26-27), సెమీఫైనల్స్​ (జనవరి 29), ఫైనల్​ (జనవరి 31) మ్యాచ్​లను మోతేరాలో నిర్వహించనున్నట్లు బీసీసీఐ తెలిపింది.

ఇదీ చూడండి: భారత్-ఆస్ట్రేలియా వన్డే సిరీస్ వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.