ETV Bharat / sports

పాండ్యతో గొడవ.. టోర్నీ నుంచి తప్పుకున్న హుడా

author img

By

Published : Jan 10, 2021, 5:30 AM IST

deepak
దీపక్​

సయ్యద్​ ముస్తక్​ అలీ టోర్నీ నుంచి యువ ఆటగాడు దీపక్ హుడా తప్పుకున్నాడు. కృనాల్​ పాండ్య అసభ్యకర వ్యాఖ్యలు చేయడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. వీరిద్దరూ ఈ టోర్నీలో ఒకే జట్టు తరఫున ఆడుతున్నారు.

తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేశాడని బరోడా సారథి కృనాల్​ పాండ్యపై ఆ జట్టు వైస్​ కెప్టెన్​ దీపక్​ హుడా ఆరోపణలు చేశాడు. ఈ మేరకు బరోడా క్రికెట్​ అసోసియేషన్​కు ఫిర్యాదు చేశాడు. ఈ కారణంగానే ఆదివారం నుంచి ప్రారంభమయ్యే 'సయ్యద్ ముస్తాక్ అలీ టీ20' టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నాడు.

గుజరాత్​ స్థానిక న్యూస్​ ఛానల్​ కథనం ప్రకారం.. కృనాల్​, హుడా మధ్య వాగ్వివాదం జరగ్గా కృనాల్,​ హుడాను బెదరించినట్లు తెలుస్తోంది. దీంతో మానసిక ఒత్తిడికి గురైన హుడా.. తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నాడట. ఉత్తరాఖండ్​ జట్టుతో ఆదివారం తన తొలి మ్యాచ్​ ఆడనుంది బరోడా. ఇందుకోసం 17 మందితో కూడిన జాబితాను ప్రకటించగా అందులో హుడా పేరు లేదు.

గతేడాది యూఏఈలో ఐపీఎల్​ అనంతరం స్వదేశానికి వచ్చిన కృనాల్​ పాండ్యను ముంబయి విమానాశ్రయంలో డైరెక్టరేట్​ ఆఫ్​ రెవెన్యూ ఇంటెలిజెన్స్​ అధికారులు అడ్డుకున్నారు. అనుమతించిన దానికంటే ఎక్కువ బంగారాన్ని కలిగి ఉండటం వల్లే అధికారులు అతడిని నిలిపివేసి చర్యలు తీసుకున్నారు.

ఇదీ చూడండి : ఎయిర్​పోర్టులో పాండ్యను అడ్డుకున్న అధికారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.