ETV Bharat / sports

రోహిత్​ శర్మ 'క్రేజీ' అభిమాని.. ఏం చేశాడంటే?

author img

By

Published : Nov 20, 2021, 9:28 AM IST

న్యూజిలాండ్​, భారత్ మధ్య రెండో టీ20 మ్యాచ్(IND vs NZ t20) సందర్భంగా ఓ అభిమాని భద్రతా సిబ్బంది కళ్లుగప్పి మైదానంలోకి ప్రవేశించాడు. రోహిత్​ శర్మ(rohit sharma fan) దగ్గరకు పరుగెత్తి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది.

rohit fan
రోహిత్ ఫ్యాన్

మ్యాచ్​ జరుగుతుండగానే మైదానంలోకి ప్రవేశించి ఫేవరెట్ ఆటగాళ్ల దగ్గరకు అభిమానులు వెళ్తుండటం ఇప్పటికే పలుమార్లు చూశాం. రాంచీ వేదికగా టీమ్​ఇండియా, న్యూజిలాండ్ మధ్య రెండో టీ20 మ్యాచ్​లో(IND vs NZ t20) భాగంగా ఇలాంటి సంఘటన మరోసారి వెలుగుచూసింది. ఓ అభిమాని (rohit sharma fan) నిబంధనలు ఉల్లంఘించి, భద్రతా సిబ్బందిని దాటుకొని టీమ్​ఇండియా టీ20 జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ దగ్గరకు పరుగెత్తాడు.

సిబ్బంది కళ్లుగప్పి..

కొవిడ్ దృష్ట్యా కఠిన బయోబబుల్​ నిబంధనల నడుమ మ్యాచ్​లు సాగుతున్నాయి. అయితే.. కట్టుదిట్టమైన సిబ్బంది ఉన్నప్పటికీ రోహిత్​ శర్మ కాళ్లను తాకేందుకు ఓ అభిమాని మైదానంలోకి పరుగులు తీయడం అందరి దృష్టిని ఆకర్షించింది.

రోహిత్​ కాళ్ల దగ్గర దండం పెడుతూ మైదానంలో పడుకున్నాడు వీరాభిమాని. వెంటనే లేచి మళ్లీ స్టేడియంలోకి పరుగెత్తాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

సిరీస్​ భారత్​దే..

న్యూజిలాండ్​పై రెండో టీ20 మ్యాచ్​లో ఘన విజయం సాధించింది టీమ్​ఇండియా. కివీస్​ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు రాహుల్, రోహిత్ అర్ధ శతకాలతో రాణించారు. దీంతో మరో మ్యాచ్​ మిగిలుండగానే సిరీస్​ సొంతం చేసుకుంది భారత్.

ఇదీ చదవండి:

వరుసగా ఐదు సార్లు.. రోహిత్-రాహుల్ అరుదైన ఫీట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.