ETV Bharat / sports

Asian Games Cricket : షెఫాలీ వర్మ మెరుపులు.. సెమీస్​కు దూసుకెళ్లిన టీమ్​ఇండియా!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 21, 2023, 12:21 PM IST

Updated : Sep 21, 2023, 12:38 PM IST

Asian Games Cricket
Asian Games Cricket

Asian Games Cricket : ఆసియా క్రీడల్లో భాగంగా జరగుతున్న క్రికెట్​ టోర్నీలో టీమ్ఇండియా మహిళల జట్టు దూసుకెళ్లింది. మ‌లేసియాతో జరిగిన క్వార్ట‌ర్ ఫైన‌ల్స్​లో రాణించిన టీమ్​ఇండియా ప్లేయర్స్​ సెమీస్​లోకి అడుగుపెట్టారు. షెఫాలీ వర్మ తన మెరపులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది.

Asian Games Cricket : ఆసియా క్రీడల్లో భాగంగా జరగుతున్న క్రికెట్​ టోర్నీలో టీమ్ఇండియా మహిళల జట్టు దూసుకెళ్లింది. వర్షం కారణంగా అంతరాయం ఏర్పడినప్పటికీ మ‌లేసియాతో జరిగిన క్వార్ట‌ర్ ఫైన‌ల్స్​లో తమదైన స్టైల్​లో చెలరేగి సెమీస్​లోకి అడుగుపెట్టారు. ఇక ఈ మ్యాచ్​లో టీమ్ఇండియా ప్లేయర్​ షెఫాలీ వర్మ ధనాధన్ రన్స్​ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది.

మ్యాచ్​ జరిగిందిలా..
India Vs Malaysia : వ‌ర్షం కార‌ణంగా ఈ మ్యాచ్‌ను 15 ఓవ‌ర్ల‌కు కుదించారు. దీంతో తొలుత బ్యాటింగ్​కు దిగిన టీమ్ఇండియా.. మైదానంలో పరుగుల వరదను పారించింది. ఇక షెఫాలీ వ‌ర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి అందరిని అబ్బురపరిచింది. కేవ‌లం 39 బాల్స్‌లోనే ఐదు సిక్స‌ర్లు, నాలుగు ఫోర్ల‌తో కొట్టి 69 పరుగులను తన ఖాతాలోకి వేసుకుంది.

ఈ మ్యాచ్​లో షెఫాలీతో పాటు జెమియా రొడ్రిగస్ రాణించి జట్టును విజయ పథంలోకి నడిపించారు. ఆడిన 29 బాల్స్‌లో ఆరు ఫోర్ల‌తో జెమియా 47 పరుగులు చేసింది. చివ‌ర్లో మైదానంలో దిగిన రిచా ఘోష్ ఏడు బాల్స్‌లోనే ఓ సిక్స‌ర్‌, మూడు ఫోర్లతో 21 పరుగులు చేసింది. దీంతో 15 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్లు మాత్ర‌మే న‌ష్ట‌పోయి భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు 173 రన్స్​ చేసింది.

అయితే భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మలేసియా.. రెండు బాల్స్ కూడా ఎదుర్కొక ముందే మ్యాచ్ ఆగిపోయింది. వర్షం కారణంగా మ్యాచ్​ను రద్దు చేసిన మేనేజ్​మెంట్​.. ఇరు జట్లకు చెరో పాయింట్​ ఇచ్చారు. దీంతో మ్యాచ్ ర‌ద్ద‌యినప్పటికీ.. ర‌న్‌రేట్ ప్ర‌కారం టీమ్​ఇండియా సెమీస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఇక ఆదివారం జరగనున్న తొలి సెమీస్‌లో భారత్ తలపడనుంది. అయితే, ఏ జట్టుతో అనేది శుక్రవారం తేలిపోనుంది. కేవలం ఒక్క మ్యాచ్‌ గెలిస్తే చాలు టీమ్ఇండియాకు పతకం ఖాయమవుతుంది. మరోవైపు తొలిసారి పురుషుల జట్టు కూడా ఆసియా గేమ్స్‌లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 3న తొలి క్వార్టర్‌ఫైనల్‌లో భారత్‌ తలపడనుంది. అయితే, ఏ జట్టుతో అన్నది మాత్రం అక్టోబర్ 2 వరకు తెలియదు. ఇక పురుషుల క్రికెట్‌ మ్యాచ్‌లు సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభం కానున్నాయి.

Asian Games 2023 : 15 పరుగులకే ఆలౌట్​.. మహిళా టీ20ల్లో చెత్త రికార్డు

Asian Games 2023 : అతి పెద్ద క్రీడా సంబరానికి వేళాయే.. నీరజ్​తో పాటు ఈ అథ్లెట్లపైనే ఆశలు

Last Updated :Sep 21, 2023, 12:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.