ETV Bharat / sports

Ashwin about West Indies Stadiums : విండీస్​ మైదానాలపై అశ్విన్ ఫైర్.. 'పచ్చిక లేదు.. నెట్స్‌ కూడా చాలా పాతవి..'

author img

By

Published : Aug 8, 2023, 1:40 PM IST

Ashwin about West Indies Stadiums : వెస్టిండీస్​లో ఉన్న మైదానాల్లో కనీస మౌలిక సదుపాయాలను కూడా కల్పించకపోవడం పట్ల టీమ్ఇండియా సీనియర్​ ప్లేయర్​ రవిచంద్రన్ అశ్విన్‌ తాజాగా విమర్శలు చేశాడు. వారు ఈ విషయాన్ని పరిశీలించి మరింత మెరుగైన సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందంటూ అశ్విన్​ అభిప్రాయపడ్డాడు.

Ashwin about West Indies Stadiums
Ashwin about West Indies Stadiums

Ashwin about West Indies Stadiums : 'మేము విలాసాలను కోరుకోవడం లేదు. కనీస సౌకర్యాలు కల్పించండి చాలు'.. అని వెస్టిండీస్‌తో సిరీస్‌ సందర్భంగా కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య చేసిన విన్నపం. ఇక ఇదే అంశంపై భారత సీనియర్‌ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ తన యూట్యూబ్‌ ఛానెల్‌లో ప్రస్తావించాడు. వెస్టిండీస్‌ క్రికెట్ బోర్డు సరైన వసతులు కల్పించడంలో విఫలమైందని పేర్కొన్న అశ్విన్​.. మైదానాల్లో మౌలిక సదుపాయాలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

" వెస్టిండీస్‌లో క్రికెట్ వృద్ధి చెందాలంటే మొదట మౌలిక వసతులు మెరుగ్గా ఉండాలి. అండర్-10, అండర్-12, అండర్‌-14 ఆటగాళ్లకు కూడా మంచి నెట్స్‌, గ్రౌండ్​ ఉండేలా చూడాలి. అప్పుడే వారిలో ఇంట్రెస్ట్​ పెరిగి క్రికెట్ ఆడేందుకు ముందుకొస్తారు. ఇది టాలెంట్‌తో కూడిన గేమ్. దీని కోసం బాగా శ్రమించాలి. అయితే మైదానాల్లో మౌలిక సదుపాయాలు అత్యంత అవసరం. వెస్డిండీస్‌ భౌగోళికంగా విభిన్నంగా ఉంటుంది. బార్బడోస్‌లో టెస్టు మ్యాచ్ కోసం నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేశాం. అక్కడ కనీసం పచ్చిక కూడా లేదు. ఆ నెట్స్‌ కూడా చాలా పాతవిగా ఉన్నాయి. అయితే, నేను ఇలా చెప్పడానికి కారణం వారిని తప్పుబట్టడానికి కాదు. మౌలిక వసతులు నాసికరంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నాణ్యమైన క్రికెట్‌ ఆడేందుకు విండీస్‌ ఆటగాళ్లు కూడా ఎంతని కష్టపడాలి? ఇలాంటి పిచ్‌ల పై ప్రాక్టీస్‌ చేసిన తర్వాత.. వారు భారత్‌ వంటి మంచి పిచ్‌లపై ఆడేందుకు అవస్థలు పడతారు. దీంతో ఆ పరిస్థితులకు అలవాటు పడటం కష్టమవుతుంది. విండీస్ పిచ్‌లు చాలా మందకొడిగా ఉంటాయి. మైదానాల నిర్వహణపై శ్రద్ధ పెట్టాలి. అయితే, విండీస్‌లో మాత్రం పచ్చికను తొలగించి రోలర్‌తో అటు ఇటూ తిప్పేసి అదే నిర్వహణగా వారు భావిస్తున్నారు. ఈ విషయంపై టెస్టు సిరీస్ సందర్భంగానూ మాట్లాడాను. అలా చేయడం చాలా సులువే. కానీ పిచ్‌ నిర్జీవంగా మారి మందకొడిగా ఉంటుంది" అని అశ్విన్‌ తెలిపాడు.

Ind Vs WI 2nd T20 : ఇక రెండో టీ20 విషయానికి వస్తే..విండీస్​తో జరిగిన రెండో టీ20లో టీమ్ఇండియా 2 వికెట్ల తేడాతో ఓడింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఆ తర్వాత అతిథ్య జట్టు 18.5 ఓవర్లలోనే టార్గెట్​ను ఛేదించింది. 'మ్యాన్ ఆఫ్​ ది మ్యాచ్' విన్నర్.. విండీస్ డేంజరస్ బ్యాటర్ నికోలస్ పూరన్.. బ్యాట్​తో విధ్వంసం సృష్టించి.. తమ జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో భారత్ వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకొని ఐదు మ్యాచ్​ల సిరీస్​లో 2-0తో వెనుకబడిపోయింది.

Nicholas Pooran Fine : పూరన్​కు ఐసీసీ షాక్.. అంపైర్​ను తిట్టినందుకు ఫైన్​తో పాటు..

రోహిత్​ గారాలపట్టికి 'తిలక్'​ హాఫ్ సెంచరీ అంకితం.. పంత్​ రికార్డు బద్దలు కొట్టిన హైదరాబాదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.