థాయ్లాండ్ వేదికగా జరగనున్న టోర్నీల్లో బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ విధించిన నిబంధనలపై మండిపడింది సైనా నెహ్వాల్. టోర్నీల్లో.. ఫిజియోలకు, శిక్షణ ఇచ్చేవారికి అనుమతి ఇవ్వకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. ఈ సమస్యకు బీడబ్ల్యూఎఫ్ త్వరలో పరిష్కారం చూపాలని ట్విట్టర్ వేదికగా కోరింది.
"శిక్షణ ఇచ్చేవారు, జట్టు వైద్యులు టోర్నీ ముగిసే వరకూ మమ్మల్ని కలిసే అవకాశం లేదు. అందరికీ కరోనా నెగటివ్గా నిర్ధరణ అయినా ఈ నిబంధన ఎందుకు?. నాలుగు వారాలు ఎవరి గైడెన్స్ లేకుండా మేం ఎలా ఆడాలి?. మంచి కండిషన్లో ఈ టోర్నీ ఆడాలనుకుంటున్నాం. ఫిజియోలను, కోచ్లను మాతో పాటు తీసుకురావడానికి చాలా డబ్బు ఖర్చు చేశాం. వీరిని అనుమతించరనే నిబంధనల గురించి ముందుగానే ఎందుకు చెప్పలేదు. జిమ్లో వ్యాయామం చేసుకునేందుకూ ఎక్కువ సమయం కేటాయించలేదు. ఈ సమస్యలను బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ వీలైనంత త్వరగా పరిష్కరించాలి."
-సైనా నెహ్వాల్, భారత బ్యాడ్మింటన్ ప్లేయర్.
కరోనా ఉద్ధృతి దృష్ట్యా బీడబ్ల్యూఎఫ్ థాయ్లాండ్ ఓపెన్కు కొన్ని నిబంధనలు పెట్టింది. బయోబబుల్లోనే టోర్నీ నిర్వహణకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో.. సరైన శిక్షణ లేకుండా బరిలోకి దిగడం శ్రేయస్కరం కాదని భావిస్తోంది భారత ప్లేయర్ సైనా. దీని ప్రభావం టోక్యో ఒలింపిక్స్పై ఉంటుందని అంటోంది.