భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ వీసా కష్టాలు ఎదుర్కుంటోంది. వచ్చే వారంలో జరగనున్న డెన్మార్క్ ఓపెన్ టోర్నీలో ఆడేందుకు వీసాకు దరఖాస్తు చేసింది సైనా. అయితే ఇంకా తన దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోందని, సమయానికి పని పూర్తవుతుందని ఆశిస్తున్నానని ట్విట్టర్లో తెలిపింది సైనా.
"హైదరాబాద్లో నా వీసా అప్లికేషన్ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ రోజు సెలవైనా.. నా విన్నపాన్ని మన్నించి ప్రక్రియ కొనసాగిస్తున్నందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారులకు కృతజ్ఞతలు. శుక్రవారం డెన్మార్క్ పయనమవ్వాల్సి ఉంది.. ఈ లోపు వీసా వస్తుందని ఆశిస్తున్నా" - సైనా నెహ్వాల్, భారత షట్లర్
అక్టోబరు 15 నుంచి 20 వరకు డెన్మార్క్ ఓపెన్ జరగనుంది. గత ఏడాది ఈ టోర్నీలో సైనా రన్నరప్గా నిలిచింది. తుదిపోరులో చైనాకు చెందిన తైజు-ఇంగ్ చేతిలో పరాజయం పాలైంది.
ఇదీ చదవండి: దక్షిణాఫ్రికా సిరీస్కు స్మృతి మంధాన దూరం