ETV Bharat / sitara

హీరోగా విజయ్ సేతుపతి టాలీవుడ్​ ఎంట్రీ!

author img

By

Published : May 28, 2021, 3:33 PM IST

విలక్షణ నటుడు విజయ్​ సేతుపతి టాలీవుడ్​లో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారా? అంటే అవుననే అంటున్నాయి సినీవర్గాలు. ఆయన కథానాయకుడిగా ప్రముఖ నిర్మాణసంస్థ మైత్రీ మూవీ మేకర్స్​ ఓ సినిమా తెరకెక్కించనుందని ప్రచారం జరుగుతోంది.

Vijay Sethupathi as the protagonist in telugu movie
హీరోగా విజయ్ సేతుపతి టాలీవుడ్​ ఎంట్రీ!

వివైధ్య, విలక్షణ నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంటున్నారు తమిళ నటుడు విజయ్ సేతుపతి. తమిళ, తెలుగు సినిమాల్లో ప్రతినాయకుడిగా, క్యారక్టర్‌ ఆర్టిస్టుగానూ నటిస్తూ మెప్పిస్తున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా తెలుగులో ఓ సినిమా తెరకెక్కనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ రూపొందించనుందని టాక్‌.

మైత్రీ మూవీస్‌ నిర్మాణ సంస్థ సేతుపతికి ఓ కథను వినిపించారట. అయితే దీనిపై అధికారికంగా వార్త బయటకు రాలేదు. త్వరలోనే సినిమాకు సంబంధించి ఓ ప్రకటన రానుందని తెలుస్తోంది. టాలీవుడ్​లో నటించేందుకు విజయ్‌ ఇప్పటికే తెలుగు భాష నేర్చుకుంటున్నారని సమాచారం.

విజయ్‌ సేతుపతి నటించిన 'పిజ్జా', 'అంజలి సీబీఐ', 'పేట' వంటి అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక చిరంజీవి ప్రధానపాత్రలో నటించిన 'సైరా నరసింహారెడ్డి'లో రాజా పాండి పాత్రలో కనిపించారు. వైష్ణవ్‌ తేజ్‌ కథానాయకుడిగా నటించిన 'ఉప్పెన'లో ప్రతినాయకుడిగా శేష రాయనం పాత్రలో చాలా బాగా నటించాడనే ప్రసంశలు కూడా వచ్చాయి. ప్రస్తుతం హిందీలో 'ముంబయికర్‌', 'గాంధీటాక్స్' వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. తమిళంలో నయనతార, సమంతతో కలిసి 'కాతు వాకుల రెండు కాదల్', 'లాబం' సినిమాలు చేస్తున్నారు.

ఇదీ చూడండి: విజయ్ సేతుపతి-కత్రినా.. 'మెర్రీ క్రిస్మస్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.