ETV Bharat / sitara

మహేశ్​-త్రివిక్రమ్​ నిర్మాతలుగా నవీన్​ పొలిశెట్టి సినిమా

author img

By

Published : Sep 15, 2021, 11:16 AM IST

సితార ఎంటర్​టైన్​మెంట్​ బ్యానర్​లో కొత్త సినిమా చేసేందుకు హీరో నవీన్​ పొలిశెట్టి గ్రీన్​సిగ్నల్​ ఇచ్చారు. అయితే ఈ చిత్రాన్ని ఫార్చూన్​ 4సినిమాస్​తో(దర్శకుడు త్రివిక్రమ్​ది​)​ కలిసి నిర్మించనున్నారు. ఈ మూవీకి కల్యాణ్​ శంకర్​ దర్శకత్వం వహించనున్నారు.

mahesh
మహేశ్​

'జాతిరత్నాలు' ఫేం నవీన్​ పొలిశెట్టి(jathi ratnalu naveen polishetty) కొత్త సినిమా ఖరారైంది. నిర్మాణ సంస్థలు సితార ఎంటర్​టైన్​మెంట్స్(naveen polishetty sitara entertainment)​, ఫార్చూన్4సినిమాస్​ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నాయి. ఈ విషయాన్ని సదరు నిర్మాణ సంస్థలు ట్వీట్​ చేశాయి. నవీన్​ పొలిశెట్టిని కొత్తగా చూపించబోతున్నట్లు వెల్లడించాయి. కాగా, ఫార్చూన్4సినిమాస్​తో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టనున్నారు దర్శకుడు త్రివిక్రమ్​.

ఈ మూవీకి కల్యాణ్​శంకర్​ దర్శకుడిగా వంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. కామెడీ నేపథ్యంలోనే ఈ సినిమా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. నవీన్​.. ఈ మూవీతో పాటు హీరోయిన్​ అనుష్కతో(anushka naveen polishetty movie) ఓ సినిమా, యూవీ క్రియేషన్స్​ బ్యానర్​లో మరో చిత్రం చేయనున్నట్లు కొద్దీ రోజులుగా ప్రచారం జరుగుతోంది.

ఇదీ చూడండి: రూ.4కోట్ల రెమ్యునరేషన్​ తిరిగిచ్చిన నవీన్​ పొలిశెట్టి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.