ETV Bharat / sitara

పునీత్ కుటుంబసభ్యులను పరామర్శించిన నాగార్జున

author img

By

Published : Nov 2, 2021, 6:41 PM IST

ఇటీవల కన్నుమూసిన కన్నడ పవర్​స్టార్ పునీత్ రాజ్​కుమార్ ఇంటికి వెళ్లి, ఆయన కుటుంబసభ్యుల్ని హీరో నాగార్జున పరామర్శించారు. పునీత్ మరణం పట్ల తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Puneeth Rajkumar
పునీత్ రాజ్​కుమార్

ప్రముఖ కథానాయకుడు నాగార్జున.. బెంగళూరులోని పునీత్ ఇంటికి వెళ్లారు. ఆయన కుటుంబసభ్యుల్ని పరామర్శించారు. పునీత్ లేడనే విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని అన్నారు. తనకు శివన్నతో(పునీత్ అన్నయ్య) ఏం మాట్లాడాలో కూడా తెలియలేదని చెప్పారు.

హీరో నాగార్జున

ఇంటిలో జిమ్ చేస్తున్న సమయంలో గుండెపోటు రావడం వల్ల పునీత్.. అక్టోబరు 29న తుదిశ్వాస విడిచారు. ఆయన హఠాన్మరణంతో అభిమానులే కాకుండా పలువురు నటీనటులు కూడా కన్నీటి పర్యంతమయ్యారు. పునీత్​తో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.