ETV Bharat / sitara

ఏక్​ విలన్2: ఆదిత్యకు తారా.. జాన్​ సరసన దిశా

author img

By

Published : Mar 11, 2020, 3:01 PM IST

Tara Sutaria to Star Opposite Aditya Roy Kapur in Mohit Suri's Ek Villain Sequel
'ఏక్​ విలన్2': ఆదిత్యకు తారా.. జాన్​ సరసన దిశా

'ఏక్​ విలన్'​ సీక్వెల్​ ఖరారైంది. ఇందులో ఆదిత్యరాయ్ కపూర్​, దిశా పటానీ, జాన్ అబ్రహం, తారా సుతారియాలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

2014లో విడుదలైన బాలీవుడ్ యాక్షన్ సినిమా 'ఏక్ విలన్'. సిద్దార్థ్​ మల్హోత్రా, రితేశ్ దేశ్​ముఖ్, శ్రద్ధా కపూర్​ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్​ను ప్రకటించారు. జాన్ అబ్రహం, ఆదిత్య రాయ్ కపూర్, దిశా పటానీ, తారా సుతారియాలు హీరోహీరోయిన్లుగా నటించనున్నారు.

తొలి భాగానికి దర్శకత్వం వహించిన మోహిత్​ సూరినే దీనికి దర్శకుడు. ఏక్తా కపూర్, భూషణ్​ కుమార్​ సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ ఏడాది ద్వితియార్థంలో షూటింగ్ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది జనవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.