'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో సన్నీ లియోనీ!

author img

By

Published : Jan 23, 2022, 6:03 PM IST

Sridevi Drama Company Latest Promo
'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో సన్నీ లియోనీ ()

Sridevi Drama Company promo: 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోకు ఏడాది పూర్తయిన సందర్భంగా నటి సన్నీ లియోనీని గెస్ట్​గా పిలిచారు. మరి ఆమె వచ్చిందా? లేదా?

Sridevi Drama Company sunny leone: ఈటీవీలో ప్రతి ఆదివారం ప్రసారమయ్యే 'శ్రీదేవి డ్రామా కంపెనీ'.. విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా షో మొత్తం సందడి సందడిగా సాగింది. అందుకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు.

ఈ ఎపిసోడ్​కు గెస్ట్​గా ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి విచ్చేశారు. ఆయన వచ్చిన సందర్భంగా ఆటో రాంప్రసాద్, జేడీ చక్తవర్తి మధ్య 'జోష్' సినిమా గురించి ఆసక్తికర సంభాషణ జరిగింది.

'బుల్లెట్ బండెక్కి..' పాట పాడిన మోహన భోగరాజు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తెగ సందడి చేసింది. షో ఏడాది పూర్తయిన సందర్భంగా సన్నీ లియోనీ ఈవెంట్​కు వస్తుందని చెప్పి, ఆమె హుస్సేన్ సాగర్​లో మునిగిపోయిందని కామెడీ చేశారు. టీవీ నటుడు అమర్​దీప్ జీవితాన్ని పాటగా రూపొందించి, అందులో అతడే నటించాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.