ETV Bharat / sitara

Ponniyin Selvan Movie: మణిరత్నం 'పొన్నియిన్ సెల్వన్​' షూటింగ్ పూర్తి

author img

By

Published : Sep 19, 2021, 10:25 AM IST

Ponniyin Selvan
పొన్నియిన్ సెల్వన్

భారీ బడ్జెట్ చిత్రం 'పొన్నియిన్ సెల్వన్​'(Ponniyin Selvan Movie) చిత్రీకరణ ఎట్టకేలకు పూర్తయింది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తొలి పార్ట్.. వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.

ప్రముఖ దర్శకుడు మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'పొన్నియిన్‌ సెల్వన్‌'(Ponniyin Selvan Movie). ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు చిత్రబృందం ప్రకటించింది. చారిత్రక కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది.

Ponniyin Selvan
పొన్నియిన్ సెల్వన్ తాజా పోస్టర్​

అయితే.. మొదటి భాగాన్ని 'పీఎస్‌ 1'(Ponniyin Selvan Movie) పేరుతో 2022 వేసవిలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఓ పోస్టర్​ను కూడా విడుదలచేసింది. 2019 డిసెంబర్‌లో థాయ్‌లాండ్​లో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. ఆ తర్వాత కరోనా కారణంగా కొంతకాలం పాటు చిత్రీకరణ‌ వాయిదా పడింది.

మద్రాస్‌ టాకీస్‌, లైకా ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్యారాయ్ బచ్చన్, విక్రమ్, త్రిష, జయం రవి, కార్తీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

జయరామ్‌, శోభిత ధూళిపాళ్ల, శరత్‌ కుమార్, ప్రకాశ్​రాజ్‌, ప్రభు, ఐశ్వర్య లక్ష్మి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

ఇదీ చదవండి: 'పొన్నియిన్ సెల్వన్​'లో విక్రమ్, ఐశ్వర్య పాత్రలు ఇవేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.