అగ్ర కథానాయిక సమంత వ్యాఖ్యాతగా 'ఆహా' ఓటీటీలో ప్రసారమైన టాక్ షో 'సామ్జామ్'. నాగచైతన్య ఇంటర్వ్యూతో తొలి సీజన్ను పూర్తయింది. ఈ సీజన్లో చిరంజీవి, అల్లు అర్జున్, రానా, విజయ్ దేవరకొండ, తమన్నా, రకుల్, క్రిష్, సైనా నెహ్వాల్ తదితరులతో సామ్ ముచ్చటించారు.
ఈ ఎపిసోడ్లన్నీ ఆద్యంతం ఆసక్తికరంగా సాగాయి. సమంత అడిగే చిలిపి ప్రశ్నలకు అతిథుల కొంటె సమాధానాలు వీక్షకులను అలరించాయి. మొదటి సీజన్కు సంబంధించిన హైలైట్స్ను 'ఆహా'.. అభిమానులతో పంచుకుంది. ఆ క్యూట్ మొమెంట్స్ను మీరూ చూసేయండి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">