ETV Bharat / sitara

పుష్ప సినిమా.. ఛాలెంజ్​ చేసిన అల్లు అర్జున్

author img

By

Published : Dec 16, 2021, 10:05 PM IST

Updated : Dec 16, 2021, 10:35 PM IST

Pushpa movie: రాజమౌళి కన్విన్స్​ చేయడం వల్లే 'పుష్ప' పాన్ ఇండియా సినిమాగా మారిందని సుకుమార్ చెప్పారు. అలానే ప్రెస్​మీట్​ సందర్భంగా హీరో అల్లు అర్జున్ ఓ ఛాలెంజ్ చేశారు.

pushpa movie allu arjun
అల్లు అర్జున్

Pushpa movie sukumar: నీటిలో పడిపోయిన తనకు చేయిచ్చి అల్లు అర్జున్ పైకి లాగాడాని దర్శకుడు సుకుమార్ చెప్పారు. 'ఆర్య' సినిమాతో తనకు దర్శకుడిగా అవకాశం ఇవ్వడంపై సుక్కు ఇలా స్పందించారు. అలానే బన్నీతో ఏడు సినిమాలు చేస్తానని అప్పట్లోనే అతడికి మాటిచ్చినట్లు సుకుమార్ అన్నారు. 'పుష్ప' రిలీజ్​ సందర్భంగా గురువారం హైదరాబాద్​లో ఏర్పాటు చేసిన ప్రెస్​మీట్​లో ఈ ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు.

pushpa hyd pressmeet
'పుష్ప' హైదరాబాద్ ప్రెస్​మీట్

Pushpa story: ఒకానొక దశలో ఈ సినిమా పాన్ ఇండియా తీయగలమా లేదా అని భయపడి వదిలేశామని సుకుమార్ చెప్పారు. కానీ ఎలా తెలిసిందో ఏమో గానీ రాజమౌళి తమకు ఫోన్​ చేసి కన్విన్స్​ చేశారని అన్నారు. దాంతో 'పుష్ప' పాన్ ఇండియా సినిమాగా మారిందని సుక్కు పేర్కొన్నారు. ఎక్కువగా చెప్పాలనుకోవట్లేదు కానీ ఈ సినిమాలో ఫెర్ఫార్మెన్స్ విషయంలో ఓ అద్భుతాన్ని చూస్తారని డైరెక్టర్ సుకుమార్ చెప్పారు. అలానే 1996-2004 మధ్య కాలంలో జరిగే కథతో 'పుష్ప' తీశామని వెల్లడించారు.

pushpa director sukumar
డైెరెక్టర్ సుకుమార్

ఈ సినిమా గురించి మాట్లాడిన హీరో అల్లు అర్జున్ ఛాలెంజ్​ చేశారు. "ఈ మూవీ రిలీజ్ అయ్యాక ప్రతి డైరెక్టర్ సుక్కు దగ్గరికి వచ్చి క్లాసెస్ తీసుకోకపోతే నేను షర్ట్ తీసేసి మైత్రీ ఆఫీస్​లో తిరుగుతా" అంటూ చెప్పుకొచ్చారు.

శేషాచలం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్య కథతో తీసిన 'పుష్ప' సినిమా.. డిసెంబరు 17న ఐదు భాషల్లో రిలీజ్ కానుంది. గతంలో బన్నీతో 'ఆర్య', 'ఆర్య2' చిత్రాలు తీసిన సుకుమార్.. 'పుష్ప'కు దర్శకత్వం వహించారు. రష్మిక హీరోయిన్​గా నటించింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మించాయి.

pushpa movie allu arjun
అల్లుఅర్జున్ పుష్ప మూవీ

ఇవీ చదవండి:

Last Updated :Dec 16, 2021, 10:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.