ETV Bharat / sitara

Maa elections 2021: 'సీసీ టీవీ వీడియోలు బయటపెట్టాలి'

author img

By

Published : Oct 14, 2021, 3:54 PM IST

prakash raj letter to maa elections returning officer
ప్రకాశ్​రాజ్

'మా' ఎలక్షన్ రోజు మోహన్​బాబు, నరేశ్​.. బెదిరించడమే కాకుండా కొందరిపై చేయిచేసుకున్నారని ప్రకాశ్​రాజ్(prakash raj panel) వెల్లడించారు. ఎన్నికల అధికారికి రాసిన లేఖలో ఈ విషయాల్ని పేర్కొన్నారు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్​ ఎన్నికల్లో(maa elections 2021) ఓటమి పాలైన ప్రకాశ్​రాజ్(prakash raj panel)​.. ఎన్నికల అధికారి కృష్ణమోహన్​కు లేఖ రాశారు. పోలింగ్ రోజు మోహన్​బాబు(mohan babu movies) దురుసుగా ప్రవర్తించారని పేర్కొన్నారు. ఆయన విచక్షణరహితంగా వ్యవహరించారని లేఖలో రాసుకొచ్చారు.

మోహన్​బాబు, నరేశ్ తీరు సీసీ కెమెరాల్లో రికార్డయిందని, సీసీ దృశ్యాలు చూస్తే అసలు విషయాలు తెలుస్తాయని ప్రకాశ్​రాజ్ లేఖలో పేర్కొన్నారు. ఆ వీడియోలను మోహన్​బాబు(mohan babu age) తొలగించే అవకాశముందని అభిప్రాయపడ్డారు. సీనీ టీవీ వీడియోలు ఇవ్వాలని ప్రకాశ్​రాజ్(prakash raj panel), ఎన్నికల అధికారిని కోరారు.

ఎన్నికలు(maa elections 2021) జరిగిన రోజు మోహన్​బాబు(mohan babu maa election results), నరేశ్​ కొందరిపై చేయిచేసుకున్నారని ప్రకాశ్​రాజ్(prakash raj panel) అన్నారు. వీరిద్దరూ తమను బెదిరించారని చెప్పారు. అసలేం జరిగిందో 'మా' సభ్యులకు తెలియాలని తాను అనుకుంటున్నట్లు ప్రకాశ్​రాజ్ లేఖలో పేర్కొన్నారు.

ప్రకాశ్​రాజ్ లేఖపై స్పందించిన ఎన్నికల అధికారి కృష్ణమోహన్.. ఎన్నికల సీసీ ఫుటేజ్ భద్రంగానే ఉందని అన్నారు. నిబంధనల ప్రకారం ఆ ఫుటేజ్​ను ప్రకాశ్​రాజ్​కు ఇస్తామని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.