ETV Bharat / sitara

'రాధేశ్యామ్'కు సీక్వెల్.. క్లారిటీ అప్పుడే..!?

author img

By

Published : Nov 4, 2021, 5:30 AM IST

డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్​కు క్రేజీ న్యూస్! సంక్రాంతి రానున్న 'రాధేశ్యామ్' సినిమాకు సీక్వెల్​ కూడా ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్​లో తెగ చర్చనీయాంశమవుతోంది.

Prabhas Radhe Shyam movie
ప్రభాస్ రాధేశ్యామ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు కానుకగా వచ్చిన 'రాధేశ్యామ్' టీజర్.. సినిమాపై అంచనాల్ని అమాంతం పెంచేసింది. దీంతో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఓ విషయం తెగ ఆసక్తి కలిగిస్తోంది.

అయితే సినిమాను కొన్ని ఆసక్తికర ట్విస్ట్​లతో ముగిస్తారట. దీంతో తర్వాత ఏం జరుగుతుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరుగుతుందని చిత్రబృందం భావిస్తోంది. తద్వాతా సీక్వెల్​ తీయొచ్చని అనుకుంటున్నారట. కానీ 'రాధేశ్యామ్' బడ్జెట్ చెప్పిన దానికంటే మించిపోయింది. దీంతో సినిమాకు వచ్చిన ఆదరణ బట్టి సీక్వెల్​ తీయాలా వద్దా అని ఆలోచిస్తారట.

1970ల నాటి యూరప్​ నేపథ్య కథతో 'రాధేశ్యామ్' తీస్తున్నారు. ఇందులో ప్రభాస్ పాలమిస్ట్(చేయి చూసి భవిష్యత్తు చెప్పే వ్యక్తి) కనిపించనున్నారు. ఆయన సరసన పూజాహెగ్డే హీరోయిన్​గా చేస్తోంది. రాధాకృష్ణ కుమార్ దర్శకుడు. యూవీ క్రియేషన్స్​ నిర్మిస్తోంది. ఈ పాన్ ఇండియా సినిమా.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలోకి రానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.