ETV Bharat / sitara

కీలకమైన చివరి షెడ్యూల్​లో 'రాధేశ్యామ్'

author img

By

Published : Apr 18, 2021, 12:06 PM IST

Prabhas kick-starts Radhe Shyam's crucial final schedule
కీలకమైన చివరి షెడ్యూల్​లో 'రాధేశ్యామ్'

మరో మూడు నెలల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న 'రాధేశ్యామ్' చివరి షెడ్యూల్​తో బిజీగా ఉంది. ప్రస్తుతం ప్రభాస్​పై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

ఏకకాలంలో నాలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ప్రభాస్.. ప్రస్తుతం 'రాధేశ్యామ్' షూటింగ్​తో బిజీగా ఉన్నారు. హైదరాబాద్​లో శనివారం నుంచే చిత్రీకరణ ప్రారంభమైంది. ఇందుకోసం భారీ సెట్​ను కూడా నిర్మించారట.

ఎడిటింగ్​లో ఉన్న కొన్ని సీన్లకు కొన్నిరోజుల క్రితం చూసిన ప్రభాస్.. వాటిని రీషూట్​ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట. వాటిని ఇప్పుడు తీస్తున్నట్లు సమాచారం.

70ల నాటి కథతో, ఐరోపా నేపథ్యంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్​గా చేస్తోంది. రాధాకృష్ణ కుమార్ దర్శకుడు. ఈ ఏడాది జులై 30న థియేటర్లలోకి రానుందీ చిత్రం.

prabhas radhe shyam
'రాధేశ్యామ్'లో ప్రభాస్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.