ETV Bharat / sitara

ఆర్​ఆర్​ఆర్​ ప్రీమియర్​ షోకి ప్రభాస్​.!

author img

By

Published : Mar 18, 2022, 11:00 AM IST

Updated : Mar 18, 2022, 12:21 PM IST

Prabhas Attend RRR Premiere: దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్ఠాత్మక చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌' మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం దేశవ్యాప్తంగా ప్రమోషన్స్‌ జోరు పెంచింది. ఇందులో భాగంగా దర్శకుడు రాజమౌళి, ఎన్​టీఆర్​, చరణ్​లు ఓ ఇంట్లోకి ప్రవేశించారు. వీరి మధ్య ఆసక్తికర సంభాషణలు జరిగాయి. వీటిలో భాగంగా ప్రీమియర్​ షోకి డార్లింగ్​ ప్రభాస్​ వస్తారా? అని ఎన్​టీఆర్​ అడిగారు.. ఇందుకు సమాధానంగా రాజమౌళి ఏం చెప్పారో మీరో చూడండి.

Prabhas Attend RRR Premiere
ఆర్​ఆర్​ఆర్​ ప్రీమియర్​ షోకి ప్రభాస్​.!

ఆర్​ఆర్​ఆర్​ ప్రీమియర్​ షోకి ప్రభాస్​.!

Prabhas Attend RRR Premiere: ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన మరో ప్రతిష్ఠాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్. మార్చి 25న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా రేపటి నుంచి దేశవ్యాప్తంగా 9 ప్రాంతాల్లో తారక్, చరణ్, రాజమౌళిలు పర్యటించబోతున్నారు. ఈ నేపథ్యంలో సినిమా సెట్​లో జరిగిన సంఘటనలు, ఉక్రెయిన్ లో నాటునాటు పాట, పులితో జరిగిన పోరాట సన్నివేశాలు, ఆర్ఆర్ఆర్ విడుదల రోజు ఎక్కడ సినిమా చూడాలన్న ఆసక్తికర విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. రాజమౌళి నివాసంలో ఆద్యంతం నవ్వులు పూయిస్తూ సాగిన ఇంటర్వ్యూలో... తారక్ కింద కూర్చొని సందడి చేశారు.

ఈ వీడియోలో రాజమౌళి, రామ్​చరణ్​, ఎన్​టీఆర్​లు సినిమాకు సంబంధించిన ప్రీమియర్​ షో ల గురించి చర్చించారు. దీనిలో భాగంగా ఎవరు ఎక్కడ చూస్తారు అని రాజమౌళి ఇద్దరిని అడుగుతారు. మీరు ఎక్కడ చూస్తే.. అక్కడే మేము కూడా అని ఎన్​టీఆర్​, చరణ్​ అంటారు. అయితే నేను 'భ్రమరాంభ'లో చూస్తాను అని రాజమౌళి అనగా... ఇందుకు స్పందించిన ఎన్​టీఆర్​.. ప్రభాస్​ వస్తారా అని అడిగారు. దీనికి సమాధానంగా జక్కన్న 'వద్దులే డార్లింగ్​.. మీరు వెళ్లి రండి' అని ప్రభాస్​ అంటారని రాజమౌళి చెప్పారు. ఇలాంటి సరదా ముచ్చట్లు ఈ వీడియో ఇంకా చాలా ఉన్నాయి.

ఇదిలా ఉంటే.. 'ఆర్‌ఆర్‌ఆర్‌' సెన్సార్‌ పూర్తయింది. యూ/ఏ సర్టిఫికేట్‌ పొందిన ఈ సినిమా నిడివి 3 గంటల 6 నిమిషాల 54 సెకన్లు. భారీ బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ కనిపించనున్నారు. అలియా భట్‌, ఒలీవియా మోరిస్‌ కథానాయికలు. అజయ్‌ దేవ్‌గణ్‌, సముద్రఖని, శ్రియ తదితరులు కీలక పాత్రలు పోషించారు. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి ఎం.ఎం. కీరవాణి స్వరాలందించారు. కొవిడ్‌ కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా.. మార్చి 25న భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకురానుంది.

ఇదీ చూడండి:

చరణ్​ నువ్విస్తే విషమైనా తాగుతా: ఎన్​టీఆర్​​

Last Updated : Mar 18, 2022, 12:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.