ETV Bharat / sitara

మహేశ్​ ఫ్యాన్స్​కు బ్యాడ్​న్యూస్.. 'సర్కారు వారి పాట' అప్డేట్ ఆలస్యం

author img

By

Published : Jan 15, 2022, 6:57 AM IST

mahesh babu
మహేశ్​బాబు

Sarkaru vaari paata news: 'సర్కారు వారి పాట' సినిమా తొలి గీతం మరింత ఆలస్యంగా రిలీజ్ చేయనున్నామని నిర్మాణ సంస్థ తెలిపింది. కొవిడ్ పరిస్థితులే అందుకు కారణమని స్పష్టం చేసింది.

Mahesh babu new movie: ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సూపర్​స్టార్ మహేశ్​బాబు అభిమానులకు మళ్లీ నిరాశే. 'సర్కారు వారి పాట' తొలిపాట సంక్రాంతికి వస్తుందనుకుని భావించిన వాళ్లకు నిర్మాణ సంస్థ సారీ చెప్పింది. పాట కోసం మరికొంత సమయం వేచిచూడాలని పోస్ట్ పెట్టింది.

sarkaru vaari paata songs
'సర్కారు వారి పాట' టీమ్ ప్రకటన

మహేశ్​బాబు 'సర్కారు వారి పాట' తొలి గీతం గురించి త్వరలో అప్డేట్​ ఇస్తామని సంగీత దర్శకుడు తమన్ శుక్రవారం ట్వీట్ చేశారు. ఇది వచ్చిన కాసేపటికే నిర్మాణ సంస్థ నుంచి ఓ ప్రకటన వచ్చింది. చిత్రబృందంలోని పలువురికి కొవిడ్ వచ్చిందని, అలానే పరిస్థితులు ప్రభావం వల్ల అప్డేట్స్ మరింత ఆలస్యం కానున్నాయని అందులో పేర్కొంది. అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది. ఈ సినిమా హీరో మహేశ్​బాబుతో పాటు సంగీత దర్శకుడు తమన్ కరోనా బారిన పడ్డారు.

బ్యాంక్​ రుణాల ఎగవేత కథతో తీస్తున్న ఈ సినిమాలో మహేశ్​ సరసన కీర్తి సురేశ్ హీరోయిన్​గా చేస్తోంది. తమన్ సంగీతమందిస్తున్నారు. పరశురామ్ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఏప్రిల్ 1న చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురానున్నారు. అయితే అది కూడా వాయిదా పడేలా కనిపిస్తోంది. ఆగస్టులో కొత్త విడుదల తేదీ ఉండొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.