ETV Bharat / sitara

National Sports Award: నీరజ్, మిథాలీ, ఛెత్రికి 'ఖేల్​రత్న'

author img

By

Published : Nov 2, 2021, 9:55 PM IST

Neeraj Chopra Mithali Raj
నీరజ్ చోప్డా మిథాలీ రాజ్

ఈ ఏడాదికిగానూ 12 మంది ప్లేయర్స్​కు ఖేల్​రత్న ప్రదానానికి సమయం ఖరారైంది. నవంబరు 13న పురస్కారాలను వారికి అందజేయనున్నారు.

నవంబరు 13న జాతీయ క్రీడా పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. 12 మంది క్రీడాకారులకు మేజర్ ధ్యాన్​చంద్ ఖేల్​రత్న ఇవ్వనున్నారు. వీరిలో టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్డా(అథ్లెటిక్స్), రవి కుమార్(రెజ్లింగ్), లవ్లీనా బోర్గోహైన్(బాక్సింగ్), శ్రీజేష్(హాకీ) ఉన్నారు. హకీ పురుషుల జట్టు కెప్టెన్ మన్​ప్రీత్ సింగ్​ పేరును తాజాగా ఈ జాబితాలో చేర్చారు.

వీరితో పాటు పారాలింపిక్ ప్లేయర్ల్ అవనీ లేఖరా, సుమిత్ అంతిల్, ప్రమోద్ భగత్, కృష్ణ నాగర్, మనీష్ నర్వాల్, మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్, ఫుట్​బాలర్ సునీల్ ఛెత్రి.. ఈ ఏడాది ఖేల్​రత్న అవార్డు అందుకోనున్నారు.

sunil chhetri
ఫుట్​బాలర్ సునీల్ ఛెత్రి

అర్జున అవార్డు గ్రహీతలు

నిషద్ కుమార్ (హైజంప్), ప్రవీణ్ కుమార్ (హైజంప్), శరద్ కుమార్ (హైజంప్), యోగేష్ కథునియా (డిస్కస్ త్రో), సుహాస్ ఎల్​వై (బ్యాడ్మింటన్), సింగ్‌రాజ్ అధానా (షూటింగ్), భవినా పటేల్ (టేబుల్ టెన్నిస్), హర్విందర్ సింగ్ (ఆర్చరీ), శిఖర్ ధావన్ (క్రికెట్) అర్జున అవార్డు అందుకోనున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.