ETV Bharat / sitara

Mahesh babu: మహేశ్​​ ప్లాన్.. టీమ్​ మొత్తానికి వ్యాక్సిన్!

author img

By

Published : Jun 3, 2021, 6:07 PM IST

mahesh babu sarkaru vaari paata team vaccination
మహేశ్​బాబు

త్వరలో షూటింగ్​లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న హీరో మహేశ్​బాబు.. తన కొత్త సినిమా బృందం మొత్తానికి కరోనా వ్యాక్సిన్ వేయించే ఏర్పాట్లు చేస్తున్నారట. త్వరలో ఈ కార్యక్రమం జరగనున్నట్లు తెలుస్తోంది.

సూపర్​స్టార్ మహేశ్​బాబు ప్రస్తుతం 'సర్కారు వారి పాట' సినిమా చేస్తున్నారు. తొలి షెడ్యూల్​ ఇప్పటికీ పూర్తవగా, రెండో షెడ్యూల్​ హైదరాబాద్​లో ప్రారంభించాలనే సమయానికి కరోనా రూపంలో ఆటంకం ఏర్పడింది. ఈ మధ్య కాలంలో కొవిడ్ తీవ్రత తగ్గుతున్న నేపథ్యంలో, త్వరలో చిత్రీకరణ తిరిగి ప్రారంభించాలని చిత్రబృందం భావిస్తోంది. అయితే ఇందుకోసం మహేశ్​బాబు సూపర్​ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే తను దత్తత తీసుకున్న గ్రామాల్లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టిన మహేశ్.. ఇప్పుడు 'సర్కారు వారి పాట' చిత్రబృందం మొత్తానికి టీకా వేయించాలని అనుకుంటున్నారట. ఇది పూర్తయితే జులై నుంచి షూటింగ్ మొదలయ్యే అవకాశముందని టాక్.

బ్యాంక్ మోసాల నేపథ్య కథతో తీస్తున్న ఈ సినిమాలో మహేశ్​ సరసన కీర్తి సురేశ్ నటిస్తోంది. పరశురామ్ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్​టైన్​మెంట్స్​, జీఎమ్​బీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే సంక్రాంతి కానుకగా చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురానున్నారు.

ఇది చదవండి: Krishna Birthday: బుర్రిపాలెంలో మహేశ్ టీకా డ్రైవ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.