ETV Bharat / sitara

ఏప్రిల్‌లో సేతుపతి 'లాభం'

author img

By

Published : Mar 20, 2021, 10:39 PM IST

Updated : Mar 21, 2021, 9:23 AM IST

విజయ్‌ సేతుపతి నూతన చిత్రం 'లాభం' త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. డబ్బింగ్​ చిత్రంగా వస్తోన్న ఈ పొలిటికల్‌ థ్రిల్లర్​కి ఎస్పీ జననాథన్‌ దర్శకత్వం వహించారు.

Laabam is an upcoming Indian Tamil-language political thriller film written and directed by S. P. Jananathan.
ఏప్రిల్‌లో సేతుపతి 'లాబం'

విజయ్‌ సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'లాభం' పొలిటికల్‌ థ్రిల్లర్‌ నేపథ్యంగా తెరకెక్కిన ఈ చిత్రానికి ఎస్పీ జననాథన్‌ దర్శకత్వం వహించారు. ఈ మధ్యే ఆయన మరణించారు. విజయ్‌ సేతుపతి ప్రొడక్షన్స్, 7సీయస్‌ ఎంటర్‌టైన్‌ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళంలో ఏప్రిల్‌లో విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఈ సినిమాలో శ్రుతిహాసన్‌, జగపతిబాబు కీలక పాత్రల్లో నటించగా సాయి ధన్షిక, కలయరసన్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. డి.ఇమ్మాన్‌ సంగీత స్వరాలు అందించగా.. రామ్జీ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఈ సినిమా సహ నిర్మాత అయిన విజయ్‌ సేతుపతి దర్శకుడు ఎస్పీ జననాథన్‌ మరణంపై స్పందిస్తూ..' జన సర్‌ ఏప్రిల్‌లో తెలుగు, తమిళంలో విడుదల కానున్న 'లాబం' సినిమాకి సంబంధించి చాలా పనులు మీరు పూర్తి చేశారు'' అని అన్నారు.

2019 ఏప్రిల్‌ 22న ప్రారంభమైందీ సినిమా షూటింగ్‌. ఇప్పటికే చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌, శ్రుతిహాసన్‌ ఆలపించిన ''యాజా యాజా'' అంటూ సాగే లిరికల్ సాంగ్‌ విడుదలై ఆకట్టుకుంటున్నాయి.

ఇదీ చదవండి: మిల్కీ బ్యూటీ సువిశాల నివాసం ఇదే..

Last Updated :Mar 21, 2021, 9:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.