మాస్ మహారాజ్ రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కిన 'క్రాక్' చిత్రం.. సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీసు వద్ద కలెక్షన్లను కొల్లగొడుతోంది. ఈ విజయంతో గోపీచంద్ మలినేనికి డిమాండ్ అమాంతంగా పెరిగిపోయింది. ఈ దర్శకుడితో సినిమా చేయాలని పలువురు యంగ్ హీరోలు ఆసక్తి చూపుతున్నట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
అయితే ఈ దర్శకుడు తన తదుపరి సినిమాను హీరో నందమూరి బాలకృష్ణతో చేసే ప్రయత్నాల్లో ఉన్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బాలయ్యకు కథ వినిపించారని, త్వరలోనే ఫుల్స్క్రిప్ట్ సిద్ధం చేయనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ సంస్థలో నిర్మించనున్నారని సమాచారం. త్వరలోనే దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశముంది.
ఇదీ చూడండి : రివ్యూ: 'క్రాక్'తో మాస్ మహారాజ్ ఫామ్లోకి వచ్చాడా?