ETV Bharat / sitara

సుఖేష్​​తో సన్నిహితంగా జాక్వెలిన్.. ఆ ఫొటో వైరల్​

author img

By

Published : Jan 8, 2022, 7:38 PM IST

Updated : Jan 8, 2022, 7:54 PM IST

Jacqueline Fernandez: బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్​ ఫెర్నాండేజ్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. మనీ లాండరింగ్​ కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న ఆమె.. అందులో ప్రధాన నిందితుడితో సన్నిహితంగా ఉన్న ఓ ఫొటో వైరల్​గా మారింది. దీనిపై ఆమె కూడా స్పందించారు.

Jacqueline Fernandez
జాక్వెలిన్ ఫెర్నాండేజ్

Jacqueline Fernandez: మనీ లాండరింగ్​ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్​ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్​తో ముద్దు పెట్టుకున్న ఫొటో బయటకు వచ్చింది. ప్రస్తుతం అది సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

Jacqueline Fernandez
సుఖేశ్​తో సన్నిహితంగా జాక్వెలిన్

ఇదివరకు కూడా సుఖేష్​తో సన్నిహితంగా ఉన్న కొన్ని ఫొటోలు బాగా వైరల్​గా మారాయి. ఈ నేపథ్యంలో తన ఇన్​స్టాగ్రామ్​లో కీలక పోస్ట్​ పెట్టారు జాక్వెలిన్. తన వ్యక్తిగత జీవితానికి భంగం కలిగించే విధంగా ఫొటోలను ప్రసారం చేయవద్దని కోరారు.

Jacqueline Fernandez
జాక్వెలిన్ పోస్ట్​

"ఈ దేశం, ఇక్కడి ప్రజలు.. నాకెంతో ప్రేమను, గౌరవాన్ని ఇచ్చారు. అందులో మీడియా మిత్రులు కూడా ఉన్నారు. ప్రస్తుతం నేను కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నాను. కానీ, దానిని అధిగమిస్తాననే నమ్మకం ఉంది. అందుకు నా వ్యక్తిగత జీవితానికి భంగం కలిగించే విధంగా ఉన్న ఫొటోలను ప్రసారం చేయవద్దని మీడియాను కోరుతున్నా. అలా చేయరనే భావిస్తున్నా. ధన్యవాదాలు."

-జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నటి

కేసు ఏమిటి?

రాన్​బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్​ సింగ్​, శివిందర్​ సింగ్​కు బెయిల్​ ఇప్పిస్తానని నమ్మించి వారి భార్యల దగ్గర నుంచి ఏకంగా రూ.200 కోట్లు వసూలు చేశాడు సుఖేష్​ చంద్రశేఖర్​. శివిందర్​ సింగ్​ భార్య అదితి సింగ్​ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్ట్​ చేసింది దిల్లీ ఆర్థిక నేరాల నిరోధక విభాగం(ఈఓడబ్ల్యూ). కేంద్ర న్యాయశాఖలోని ఉన్నతాధికారిగా పరిచయం చేసుకుని వారిని మోసం చేసినట్లు తేల్చింది.

Jacqueline Fernandez
సుఖేశ్​తో జాక్వెలిన్

రూ.200 కోట్ల దోపిడీ కేసులో చంద్రశేఖర్​ సన్నిహితుడు లీనా మరియా పాల్​ సహా.. బాలీవుడ్​ హీరోయిన్​ జాక్వెలిన్​ ఫెర్నాండెజ్​ను ఈడీ ప్రశ్నించింది. తిహాడ్​ జైలు నుంచే కాలర్​ ఐడీ స్పూఫింగ్​ ద్వారా జాక్వెలిన్​ ఫెర్నాండెజ్​ను సుకేశ్​ చంద్రశేఖర్ సంప్రదించినట్లు ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ వర్గాలు తెలిపాయి. తన గుర్తింపును దాచి పెట్టి, తనను తాను పెద్ద పలుకుబడి ఉన్న వ్యక్తిగా పరిచయం చేసుకుని ఆమెతో మాట్లాడేవాడని తెలుసుకున్నారు. అతన్ని జాక్వెలిన్​ నమ్మటం ప్రారంభించిన క్రమంలో.. ఖరీదైన పూలు, చాక్లెట్లు బహుమతిగా పంపేవాడని చెప్పారు. సుఖేష్​కు సంబంధించిన 20కిపైగా కాల్​ రికార్డులు ఈడీ దగ్గర ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Jacqueline Fernandez
జాక్వెలిన్ ఫెర్నాండేజ్

రూ.200 కోట్ల దోపిడీ కేసులో దిల్లీ పోలీసు ఆర్థిక నేరాల నిరోధక విభాగం(ఈఓడబ్ల్యూ) విచారణ కొనసాగిస్తోంది. సుఖేష్​ చంద్రశేఖర్​, లీనా పాల్​పై దేశవ్యాప్తంగా 23 చీటింగ్​ కేసులు ఉన్నాయి.

ఇవీ చూడండి:

సుకేశ్​ నుంచి ఫెర్నాండెజ్​ అందుకున్న కానుకలు ఇవే!

ఈడీ విచారణకు బాలీవుడ్​ నటి​- ఆ 50 ప్రశ్నలకు జవాబు దొరికేనా?

అతడి నుంచి గిఫ్ట్​గా ఖరీదైన పిల్లులు.. అందుకే ఆ నటికి ఇన్ని కష్టాలు!

Last Updated :Jan 8, 2022, 7:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.