ETV Bharat / sitara

ఈడీ విచారణకు బాలీవుడ్​ నటి​- ఆ 50 ప్రశ్నలకు జవాబు దొరికేనా?

author img

By

Published : Dec 8, 2021, 12:07 PM IST

Jacqueline Fernandez News: మనీలాండరింగ్​ కేసులో మరోసారి ఈడీ ఎదుట హాజరైంది బాలీవుడ్​ నటి జాక్వెలిన్​ ఫెర్నాండెజ్​. సుకేశ్​ చంద్రశేఖర్​కు సంబంధించిన రూ.200 కోట్ల మనీలాండరింగ్​ కేసులో ఆమెను అధికారులు విచారిస్తున్నారు.

Actor Jacqueline Fernandez
Actor Jacqueline Fernandez , జాక్వెలిన్​ ఫెర్నాండెజ్​, ఈడీ

Jacqueline Fernandez News: బాలీవుడ్​ నటి జాక్వెలిన్​ ఫెర్మాండెజ్​ మరోసారి ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్(ఈడీ)​ ఎదుట హాజరైంది. వ్యాపారవేత్త సుకేశ్​ చంద్రశేఖర్​కు సంబంధించి రూ. 200 కోట్ల మనీలాండరింగ్​ కేసులో 8న హాజరుకావాలని ఆమెకు ఈ సోమవారమే సమన్లు జారీ చేసింది ఈడీ. ఈ నేపథ్యంలోనే ఉదయం ఆమె దిల్లీలోని ఈడీ కార్యాలయానికి చేరుకుంది. అధికారులు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేస్తున్నారు. ఇప్పటికే సిద్ధం చేసుకున్న 50 ప్రశ్నలకు జవాబు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడు సుకేశ్​ చంద్రశేఖర్​, అతని భార్య, నటి లీనా మరియా పాల్​తో పాటు మరో ఆరుగురి పేర్లను ఛార్జ్​షీట్​లో చేర్చారు. చంద్రశేఖర్​.. జాక్వెలిన్​కు విలువైన కానుకలు ఇచ్చినట్లు గుర్తించి ఆమెను గతంలో రెండు, మూడు సార్లు విచారించారు అధికారులు.

Actor Jacqueline Fernandez appears before Enforcement Directorate
సుకేశ్​తో జాక్వెలిన్​

Jacqueline Fernandez ED Summons:

జాక్వెలిన్‌ ఈ నెల 5న దుబాయికి బయల్దేరగా.. ముంబయి విమానాశ్రయంలో అధికారులు ఆమెను అడ్డుకున్నారు. ఈడీ లుక్‌అవుట్‌ నోటీసులు ఉండటంతో ఆమెను విదేశాలకు వెళ్లకుండా ఇమ్మిగ్రేషన్‌ అధికారులు నిలిపివేశారు.

ఇదీ కేసు..

రాన్​బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్​ సింగ్​, శివిందర్​ సింగ్​కు బెయిల్​ ఇప్పిస్తానని నమ్మించి వారి భార్యల దగ్గర నుంచి ఏకంగా రూ.200 కోట్లు వసూలు చేశాడు సుకేశ్​ చంద్రశేఖర్​. శివిందర్​ సింగ్​ భార్య అదితి సింగ్​ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్ట్​ చేసింది దిల్లీ ఆర్థిక నేరాల నిరోధక విభాగం(ఈఓడబ్ల్యూ). కేంద్ర న్యాయశాఖలోని ఉన్నతాధికారిగా పరిచయం చేసుకుని వారిని మోసం చేసినట్లు తేల్చింది.

రూ.200 కోట్ల దోపిడీ కేసులో చంద్రశేఖర్​ సన్నిహితుడు లీనా మరియా పాల్​ సహా.. బాలీవుడ్​ హీరోయిన్​ జాక్వెలిన్​ ఫెర్నాండెజ్​ను ఈడీ ప్రశ్నించింది. తిహాడ్​ జైలు నుంచే కాలర్​ ఐడీ స్పూఫింగ్​ ద్వారా జాక్వెలిన్​ ఫెర్నాండెజ్​ను సుకేశ్​ చంద్రశేఖర్ సంప్రదించినట్లు ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ వర్గాలు తెలిపాయి. తన గుర్తింపును దాచి పెట్టి, తనను తాను పెద్ద పలుకుబడి ఉన్న వ్యక్తిగా పరిచయం చేసుకుని ఆమెతో మాట్లాడేవాడని తెలుసుకున్నారు. అతన్ని జాక్వెలిన్​ నమ్మటం ప్రారంభించిన క్రమంలో.. ఖరీదైన పూలు, చాక్లెట్లు బహుమతిగా పంపేవాడని చెప్పారు. సుకేశ్​కు సంబంధించిన 20కిపైగా కాల్​ రికార్డులు ఈడీ దగ్గర ఉన్నట్లు అధికారులు తెలిపారు.

రూ.200 కోట్ల దోపిడీ కేసులో దిల్లీ పోలీసు ఆర్థిక నేరాల నిరోధక విభాగం(ఈఓడబ్ల్యూ) విచారణ కొనసాగిస్తోంది. సుకేశ్​ చంద్రశేఖర్​, లీనా పాల్​పై దేశవ్యాప్తంగా 23 చీటింగ్​ కేసులు ఉన్నాయి.

ఇదీ చూడండి: అతడి నుంచి గిఫ్ట్​గా ఖరీదైన పిల్లులు.. అందుకే ఆ నటికి ఇన్ని కష్టాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.