ETV Bharat / sitara

రెండు తరాల హీరోలతో నటన.. ఈ హీరోయిన్ల ఘనత

author img

By

Published : Nov 14, 2020, 9:30 AM IST

ఒకే కుటుంబంలోని రెండు తరాల హీరోలకు జోడీగా నటించాలంటే హీరోయిన్లకు సవాలే! దానికి వయసు, గ్లామర్​ లాంటి అంశాలు అడ్డొస్తాయి. కానీ, కొందరు భామలు వాటిని అధిగమించి తండ్రీ కొడుకుల సినిమాల్లో నటించారు. అభిమానులను అలరించారు. ఇంతకీ ఆ ముద్దుగుమ్మలు ఎవరంటే?

heroines who acted with two generations in tollywood
రెండు తరాలతో మెప్పించిన నాయికలు వీరే!

ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా గట్టిగా పదేళ్లు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కష్టం. అలాంటిది ప్రస్తుతం దశాబ్దాలకు పైగా సినీపరిశ్రమల్లో పాతుకుపోతున్నారు కొందరు కథానాయికలు. అలానే వయసుతో సంబంధం లేకుండా అటు తండ్రి, ఇటు కొడుకు సరసన నటించేందుకు గ్రీన్​ సిగ్నల్​ ఇస్తున్నారు. ఒకే కుటుంబంలో తండ్రీకొడుకుల సినిమాల్లో హీరోయిన్​గా చేయడం అంటే మామూలు విషయం కాదు. ఆ విషయాన్ని సాధ్యం చేసి చూపించారు కొందరు ముద్దుగుమ్మలు. వారి గురించే ఈ కథనం.

మెగా హీరోలతో..

లక్ష్మీ కల్యాణం చిత్రంతో టాలీవుడ్​లో ఎంట్రీ ఇచ్చిన కాజల్​ అగర్వాల్​.. రామ్​ చరణ్​ హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో'మగధీర'లో నటించి స్టార్​ హోదా తెచ్చుకుంది. ఆ తర్వాత చరణ్​తో 'నాయక్'​, 'గోవిందుడు అందరివాడేలే' చిత్రాల్లోనూ ఆడిపాడింది. మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ సినిమా 'ఖైదీ నెం.150'లో హీరోయిన్​గా చేసి అలరించింది. దీంతో తండ్రీకొడుకులైన చిరు, చరణ్​ల సినిమాల్లో కథానాయికగా చేసిన ఘనతను కాజల్​ సొంతం చేసుకుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
  • " class="align-text-top noRightClick twitterSection" data="">

తన విభిన్న నటనతో పాన్​-ఇండియా స్థాయిలో అభిమానులను సంపాదించుకుంది తమన్నా. 2005లో వచ్చిన 'శ్రీ' చిత్రంతో టాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె.. దశాబ్ద కాలంగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. రామ్​ చరణ్ సరసన 'రచ్చ'లో నటించి, ఆ తర్వాత చిరు 'సైరా'లోనూ కీలక పాత్ర పోషించింది. కాజల్​​ తర్వాత చిరు, చెర్రీలతో కలిసి నటించిన ఘనత తమన్నాదే.

అక్కినేని వారసులతో..

రకుల్​ ప్రీత్​ సింగ్​ బాలీవుడ్​లో తొలి సినిమా చేసినప్పటికీ.. తెలుగు, తమిళ భాషల్లోనే ఎక్కువగా నటించి గుర్తింపు తెచ్చుకుంది. నాగచైతన్య 'రారండోయ్​ వేడుక చూద్దాం'లో నటించి హిట్​ అందుకున్న ఈమె.. ఆ తర్వాత నాగార్జున 'మన్మథుడు 2'లోనూ హీరోయిన్​గా చేసి ఆకట్టుకుంది. దీంతో అక్కినేని కుటుంబంలో రెండు తరాలతో నటించిన ఘనతను రకుల్​ దక్కించుకుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'అందాల రాక్షసి' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన లావణ్య త్రిపాఠి.. తన​ నటనతో విమర్శకుల ప్రశంసలూ అందుకుంది. 'భలే భలే మగాడివోయ్​', 'సోగ్గాడే చిన్ని నాయనా' లాంటి చిత్రాలతో సూపర్​హిట్లను సొంతం చేసుకుంది. నాగార్జున 'సోగ్గాడే చిన్నినాయనా'తో పాటు ఆయన కుమారుడు నాగచైతన్య 'యుద్ధం శరణం' సినిమాలోనూ నటించి, రెండు తరాల హీరోలతో చేసిన భామగా గుర్తింపు తెచ్చుకుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి:ఆ హీరోయిన్ల జోరు.. పెళ్లి అయితే మాకేంటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.