ETV Bharat / sitara

అశ్రునయనాలతో బాలుకు అంతిమ వీడ్కోలు

author img

By

Published : Sep 26, 2020, 12:51 PM IST

Updated : Sep 26, 2020, 3:50 PM IST

తమిళనాడు తామరైపాక్కంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు పూర్తయ్యాయి. ప్రభుత్వ లాంఛనాలతో కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయనకు తుది వీడ్కోలు పలికారు.

sp balasubrahmanyam
బాలు

తన గాత్రంతో మైమరిపించి కోట్లాది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన స్వర గంధర్వుడు బాలు స్వర్గపురికి చేరారు. తమిళనాడు తామరైపాక్కం వ్యవసాయ క్షేత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంతిమ సంస్కారాలు జరిగాయి. కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రభుత్వ లాంఛనాలతో బాలుకు తుది వీడ్కోలు పలికారు.

ఎస్పీ బాలు అంత్యక్రియలు

బాలు చివరి చూపు కోసం వేలాదిగా అభిమానులు తరలివచ్చారు. కొవిడ్​ నిబంధనల నేపథ్యంలో పరిమిత సంఖ్యలో అంత్యక్రియలకు అనుమతించారు. ఆయన అంతిమ సంస్కారాలకు ఏపీ ప్రభుత్వం తరఫున మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ హాజరై నివాళులర్పించారు. సినీ ప్రముఖులు భారతీరాజా, దేవిశ్రీ ప్రసాద్‌, మనో తదితరులు బాలు భౌతిక కాయాన్ని కడసారి చూసి నివాళులర్పించారు.

Last Updated : Sep 26, 2020, 3:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.