సీనియర్ నటీమణులు ఖుష్బూ, శోభనకు కరోనా

author img

By

Published : Jan 10, 2022, 11:23 PM IST

Khushbu

సినీ పరిశ్రమలో కరోనా కలకలం కొనసాగుతోంది. ప్రముఖ సినీయర్ నటీమణులు ఖుష్బూ సుందర్, శోభనకు కొవిడ్ పాజిటివ్​ వచ్చింది.

ప్రముఖ సినీ నటి, రాజకీయవేత్త ఖుష్బూ సుందర్ సోమవారం కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ట్విట్టర్​లో వెల్లడించారు ఖుష్బూ. రెండు వేవ్​లు తప్పించుకున్నా, మూడో వేవ్​లో వైరస్​కు చిక్కినట్లు పేర్కొన్నారు.

  • Ok. finally #Covid catches up with me after dodging last 2 waves. I have just tested positive. Till last eve i was negative. Have a running nose,did a test n Voila! I have isolated myself. Hate being alone. So keep me entertained for the next 5 days. N get tested if any signs 🥰

    — KhushbuSundar (@khushsundar) January 10, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

శోభనకు ఒమిక్రాన్‌

అంతకుముందు సీనియర్‌ నటి, భరతనాట్య కళాకారిణి శోభన ఒమిక్రాన్‌ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. తనకు కీళ్ల నొప్పులు, చలిజ్వరం ఉన్నట్టు ఆమె తన ఇన్‌స్టా ఖాతాలో పేర్కొన్నారు. వ్యాక్సిన్లు వేసుకున్నా, ఎంత జాగ్రత్తగా ఉన్నా తనకు ఈ కొత్త వేరియంట్‌ సోకిందని తెలిపారు. అయితే, తాను కరోనా వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్నానని.. ఇప్పటికీ వ్యాక్సిన్‌ తీసుకోని వారు వెంటనే తీసుకోవాలని సూచించారు.

shobhana
శోభన

ఇదీ చూడండి: Bandla Ganesh Corona: బండ్ల గణేశ్​కు మూడోసారి కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.