ETV Bharat / sitara

రియల్ సినతల్లికి రూ.15 లక్షల చెక్ అందజేసిన సూర్య

author img

By

Published : Nov 17, 2021, 11:42 AM IST

Updated : Nov 17, 2021, 12:03 PM IST

'జై భీమ్' హీరో సూర్య ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. రియల్ సినతల్లి పార్వతికి రూ.15 లక్షల చెక్​ను అందజేశారు.

Actor Surya presents a cheque for Rs 15 lakh  the real character of Jai Bhim movie
జై భీమ్ మూవీ

తమిళ స్టార్ హీరో సూర్య.. రియల్ సినతల్లి పార్వతికి రూ.15 లక్షల చెక్​ను అందజేశారు. ఈమె భర్త రాజకన్ను.. పోలీసు విచారణలో మృతి చెందారు. వీళ్ల కథతోనే తీసిన 'జై భీమ్' ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది.

ఈ సినిమాలో సూర్య.. నిజజీవితంలో పార్వతికి సహాయం చేసిన న్యాయవాది చంద్రు పాత్రలో నటించి మెప్పించారు. దీపావళి కానుకగా నవంబరు 2న అమెజాన్ ప్రైమ్​లో విడుదలైన ఈ చిత్రం.. విశేషాదరణ దక్కించుకుంది. ఇరులార్ తెగకు చెందిన వ్యక్తులకు ఎదురయ్యే సమస్యలను ఇందులో కళ్లకు కట్టినట్లు చూపించారు!

jai bheem movie
జై భీమ్ మూవీ

ఇటీవల కమ్యూనిస్ట్​ పార్టీ.. పార్వతికి సహాయం చేయమని సూర్యను కోరింది. దీనిపై స్పందించిన ఆయన.. రూ.10 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారు. ఆమెను మంగళవారం తన ఇంటికి పిలిపించిన సూర్య.. తన వంతు రూ.10 లక్షలు, తన నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్​టైన్​మెంట్స్​ తరఫున రూ.5 లక్షలు.. మొత్తం రూ.15 లక్షల చెక్​ను పార్వతికి అందజేశారు.

అయితే సినిమాలో తమ వర్గాన్ని కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయమని వన్నియర్ వర్గం.. సూర్యకు ఇటీవల లీగల్​ నోటీసులు పంపింది. దీనిపై అభిమానుల నుంచి సూర్యకు భారీగా మద్దతు లభిస్తోంది.

jai bheem movie
సూర్య 'జై భీమ్' మూవీ

ఇవీ చదవండి:

Last Updated : Nov 17, 2021, 12:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.