ETV Bharat / priya

నేరేడు పండు- లాభాలు మెండు

author img

By

Published : Jun 22, 2021, 12:59 PM IST

ఊదా, నలుపు రంగుల మిశ్రమంతో మిలమిలా మెరుస్తూ.. రుచికి కాస్త వగరుగా ఉండే నేరేడు పండ్లు ఈ కాలంలో ఎక్కువగా దొరుకుతాయి. వీటిని తినడం వల్ల కలిగే లాభాలేంటో చూద్దామా..

నీటి వల్ల కలిగే ఇన్​ఫెక్షన్లు తగ్గాలన్నా, రోగ నిరోధకశక్తి పెంచుకోవాలన్నా నేరేడు పండ్లు తినడం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి వాటి వల్ల ఇంకా ఏయే ప్రయోజనాలున్నాయో చూద్దామా..

  • నేరేడు పండ్లలో యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. వీటిని తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది.
  • చిన్నా, పెద్దా, మధుమేహులు, ఊబకాయులు.. ఇలా అందరూ తినొచ్చు.
  • ఈ పండు కాస్త వగరుగా ఉంటుంది. దీంట్లో గాలిక్‌ యాసిడ్‌ కాస్త ఎక్కువ పరిమాణంలో ఉండటమే దీనికి కారణం. ఈ పండులో యాంథోసయనిన్స్‌ అనే రసాయనాలు మెండుగా ఉంటాయి. ఇవి ఇన్సులిన్‌ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. కాబట్టి మధుమేహులూ తినొచ్చు.
  • వాంతులు, వికారంగా ఉన్నప్పుడు వీటిని తింటే తగ్గుముఖం పడతాయి.
  • ఇవి కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయి.
  • నేరేడు పండ్లను క్రమం తప్పకుండా తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గి, మంచి కొలెస్ట్రాల్‌ పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
  • నీటి వల్ల కలిగే ఇన్‌ఫెక్షన్లు ఈ పండ్లు తింటే తగ్గుముఖం పడతాయి.
  • నేరేడు పండ్లలో పిండిపదార్థాలు, మాంసకృత్తులతోపాటు ఫాస్ఫరస్‌, క్యాల్షియం, ఇనుము సమృద్ధిగా ఉంటాయి.

ఇవీ చదవండి: ఏ అరటి పండు ఎప్పుడు తినాలో తెలుసా?

మామిడి పండు అ'ధర'హో- కేజీ రూ.2లక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.