LIVE : శ్రీసత్యసాయి జిల్లాలో ప్రధాని మోదీ పర్యటన

By ETV Bharat Telangana Team

Published : Jan 16, 2024, 2:20 PM IST

Updated : Jan 16, 2024, 5:19 PM IST

thumbnail

PM Narendra Modi Inaugurate NACIN LIVE : ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ , పరోక్ష పన్నులు, నార్కోటిక్స్ ఇన్ స్టిట్యూట్​ను ప్రధాని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్​తో పాటు సీఎం జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. మంగళవారం మధ్యాహ్నం పాలసముద్రానికి చేరుకున్న ప్రధాని ప్రారంభోత్సవం అనంతరం అకాడమీలోని కేంద్రాలను సందర్శించారు. అనంతరం ట్రైనీ అధికారులు, నిర్మాణ కార్మికులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం ఫ్లోరా ఆఫ్ పాలసముద్రం అనే పుస్తకాన్ని మోదీ విడుదల చేశారు. తర్వాత ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసగింస్తున్న మోదీ, అనంతరం NACINకు గుర్తింపు పత్రాన్ని అందజేయనున్నారు. తర్వాత లేపాక్షి ఆలయాన్ని సందర్శిస్తారు. సాయంత్రం తిరిగి దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో నాసిన్ వెలుపల భద్రతను కట్టుదిట్టం చేశారు. నాసిన్ ఆవరణలో కేంద్ర ప్రభుత్వ రక్షణ దళాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. నాసిన్​ను పీఎం నరేంద్ర మోదీ ప్రసంగించారు.

Last Updated : Jan 16, 2024, 5:19 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.