ETV Bharat / jagte-raho

ఏటీఎంలో చోరీకి యత్నం... అలారం మోగడం వల్ల పరారీ

author img

By

Published : Aug 16, 2020, 3:34 PM IST

unknown-persons-attempted-to-theft-at-andhra-bank-atms-in-siddipet-district
ఏటీఎంలో చోరీకి యత్నం... అలారం మోగడం వల్ల పరారీ

సిద్ధిపేట జిల్లాలో ఏటీఎంలోని చోరీకు దుండగులు విపలయత్నం చేశారు. అక్కడ ఉన్న అలారం మోగడం వల్ల దొంగలు పారిపోయారు. కేసు నమోదు చేసిన దుబ్బాక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్​లోని ఆంధ్రాబ్యాంకు ఏటీఎంను ధ్వంసం చేసి డబ్బు దోచుకెళ్లేందుకు దొంగలు విఫలయత్నం చేశారు. అక్కడ ఉన్న అలారం మోగడం వల్ల చోరీగాళ్లు పారిపోయారు. మిరుదొడ్డి మండల కేంద్రంలోని ఆంధ్రాబ్యాంకు ఏటీఎంలో సీసీ కెమెరాల వైర్లు కట్ చేసి చోరీకి యత్నించారు.

ఇంతలో అందులోని సైరన్ మోగడం వల్ల దొంగలు పరారు అయిన మరో ఘటన ఇవాళ ఉదయం వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న ఆంధ్రాబ్యాంకు మేనేజర్ మహేందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్, దుబ్బాక సీఐ హరికృష్ణ గౌడ్ సంఘటనా స్థలానికి చేరుకుని దుండగులు ధ్వంసం చేసిన ఏటీఎం సెంటర్​ను పరిశీలించారు.

ఒక దొంగల ముఠా ఈ ప్రాంతంలో సంచరించి చోరీకి యత్నించిన్నట్లు తెలుస్తుంది. స్థానికంగా ఉన్నమరిన్ని సీసీ కెమెరాలను పరిశీలించి త్వరలోనే కేసును ఛేదిస్తామని ఏసీపీ రామేశ్వర్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ వెల్లడించారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.