ETV Bharat / jagte-raho

యాదగిరిగుట్టలో గుర్తు తెలియని వ్యక్తి మృతి.. కేసు నమోదు

author img

By

Published : Aug 30, 2020, 2:52 PM IST

యాదగిరిగుట్టలోని పాతగుట్ట రోడ్డులో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

unidentified-man-killed-in-yadagirigutta-case-registered
యాదగిరిగుట్టలో గుర్తు తెలియని వ్యక్తి మృతి.. కేసు నమోదు

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని పాతగుట్ట రోడ్డులో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానిక విజయలక్ష్మి గార్డెన్ ఎదురుగా నూతనంగా నిర్మితమవుతోన్న రూంలో స్థానికులు మృతదేహాన్ని గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు.

మృతుడు గత కొంతకాలంగా రోజువారీ కూలీ పనిచేసుకుంటూ పట్టణంలో జీవనం సాగిస్తున్నాడని స్థానికులు పేర్కొన్నారు. మద్యానికి బానిసై, అనారోగ్యంతో మృతి చెందినట్లు వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామకృష్ణారెడ్డి తెలిపారు.

ఇవీ చూడండి: బ్యాంకును మోసం చేశారంటూ సర్వోమ్యాక్స్​పై సీబీఐలో కేసు నమోదు

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.