ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులో జంట హత్యలు కలకలం సృష్టించాయి. నవలాకులతోటకు చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తి అనుమానంతో తన భార్య నిర్మలమ్మతో పాటు మరో మహిళ రమణమ్మను గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం పోలీసులు స్టేషన్లో లొంగిపోయాడు.
తరచూ వీరి కాపురంలో గొడవలు జరుగుతుండేవని బంధువులు తెలిపారు. మృతదేహాలను మార్చురీకి తరలించారు. నెల్లూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చూడండి: పింఛను సొమ్ము కోసం కన్నతల్లిని చంపిన కర్కశుడు