ETV Bharat / jagte-raho

ఇద్దరి దారుణహత్య: బండరాళ్లతో మోది కిరాతకంగా చంపేశారు!

author img

By

Published : Jan 25, 2021, 9:01 AM IST

Updated : Jan 25, 2021, 11:40 AM IST

murder
murder

08:58 January 25

బండరాళ్లతో మోది.. ఇద్దరు వ్యక్తుల హత్య

నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎంఏ బేగ్​ ఫంక్షన్ వెనకాల గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తుల మృతదేహాలు లభించాయి. అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బండరాళ్లతో మోది ఆ ఇద్దర్ని హత్య చేసినట్లు గుర్తించారు. వారి పక్కనే మద్యం సీసాలు ఉన్నట్లు గుర్తించామని డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు.

                       మృతుల వయస్సు 28-30 మధ్య ఉన్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. వీరు వేరే ప్రాంతానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్​ టీం సాయంతో దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. హత్య అర్ధరాత్రి సమయంలో జరిగినట్లుగా అనుమానిస్తున్నారు. 

ఇదీ చదవండి : అమందా కవిత.. అక్కడ మారుమోగింది!

Last Updated :Jan 25, 2021, 11:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.