Tollywood Producer Suryadevara Radhakrishna Mother passes away : టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి సూర్యదేవర నాగేంద్రమ్మ (90) తుదిశ్వాస విడిచారు. హృదయ సంబంధిత వ్యాధితో ఆమె కన్నుమూసినట్లు తెలిసింది. కాగా, సూర్యదేవర నాగేంద్రమ్మ (90)కు ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. రాధాకృష్ణ రెండో కుమారుడు కాగా, నిర్మాత సూర్యదేవర నాగవంశీకి ఆమె నాయనమ్మ అవుతారు. రేపు(మే 31) ఉదయం పది గంటలకు ఫిల్మ్ నగర్లోని శ్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు చెప్పారు. అయితే సూర్యదేవర నాగవంశీ నిర్మించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈ శుక్రవారమే థియేటర్లలో విడుదల కానుంది. ఈ సమయంలోనే వారి కుటుంబంలో విషాదం నెలకొంది.
నిర్మాత నాగవంశీ ఇంట్లో తీవ్ర విషాదం
![ETV Bharat Telugu Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telugu-1716536082.jpeg?imwidth=128)
Published : May 30, 2024, 6:16 PM IST
|Updated : May 30, 2024, 7:01 PM IST
![నిర్మాత నాగవంశీ ఇంట్లో తీవ్ర విషాదం Source ETV Bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-05-2024/1200-675-21596151-622-21596151-1717075801977.jpg?imwidth=3840)
Tollywood Producer Suryadevara Radhakrishna Mother passes away : టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి సూర్యదేవర నాగేంద్రమ్మ (90) తుదిశ్వాస విడిచారు. హృదయ సంబంధిత వ్యాధితో ఆమె కన్నుమూసినట్లు తెలిసింది. కాగా, సూర్యదేవర నాగేంద్రమ్మ (90)కు ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. రాధాకృష్ణ రెండో కుమారుడు కాగా, నిర్మాత సూర్యదేవర నాగవంశీకి ఆమె నాయనమ్మ అవుతారు. రేపు(మే 31) ఉదయం పది గంటలకు ఫిల్మ్ నగర్లోని శ్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు చెప్పారు. అయితే సూర్యదేవర నాగవంశీ నిర్మించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈ శుక్రవారమే థియేటర్లలో విడుదల కానుంది. ఈ సమయంలోనే వారి కుటుంబంలో విషాదం నెలకొంది.