ETV Bharat / jagte-raho

బైక్‌ను ఢీకొన్న కారు.. ఇద్దరు దుర్మరణం

author img

By

Published : Jan 14, 2021, 5:29 PM IST

ద్విచక్ర వాహనాన్ని కారు ఢీ కొట్టగా.. ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఈ విషాద ఘటన ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా చట్టీ వద్ద జరిగింది.

two persons died in road accident
బైక్‌ను ఢీకొన్న కారు.. ఇద్దరు దుర్మరణం

ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలం చట్టీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మండలంలోని నరసింహపురం గ్రామానికి చెందిన రామకృష్ణ, సీతయ్య ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. తెలంగాణ నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న కారు బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కకడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: చంచల్​గూడ జైలుకు మాజీమంత్రి అఖిలప్రియ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.