ETV Bharat / jagte-raho

ఇద్దరు చిన్నారులను చిదిమేసిన బొలెరో వాహనం

author img

By

Published : Oct 2, 2020, 9:40 PM IST

Breaking News

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. టైర్​ పంక్చరై అదుపు తప్పిన బొలెరో వాహనం పిల్లలపైకి దూసుకెళ్లింది. దీంతో రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న చిన్నారులు అక్కడికక్కడే చనిపోయారు. ఈ విషాదకర ఘటన వరంగల్​ అర్బన్​ జిల్లాలో చోటుచేసుకుంది.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందిన దుర్ఘటన వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ మండలం స్టేషన్ పెండ్యాల జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. కాజీపేట్ నుంచి హైదరాబాద్ వైపునకు వెళ్తున్న బొలెరో వాహనం టైర్ పంక్చరైంది. దీంతో వాహనం అదుపు తప్పి.. రోడ్డు పక్కన నడుచుకుంటు వెళ్తున్న ఇద్దరు చిన్నారులను ఢీకొంది.

ఈ ఘటనలో తెప్ప నాగరాజు (13), తెప్ప విశాల్ (8) అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ఇద్దరు అన్నదమ్ముల కుమారులే కావడం వల్ల వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకోవడం వల్ల కొంతమేర ట్రాఫిక్​కి అంతరాయం ఏర్పడింది.

కాజీపేట్ ఏసీపీ రవీంద్ర కుమార్, ధర్మసాగర్ ఎస్సై భరత్​ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించి.. ట్రాఫిక్​ని పునరుద్దించారు.

ఇదీ చదవండి: చిన్నారిని ఢీ కొట్టిన టిప్పర్ లారీ.. చికిత్స పొందుతూ మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.