ETV Bharat / jagte-raho

మెట్లపై నుంచి కిందపడి కుమారుడు.. గుండెపోటుతో తండ్రి

author img

By

Published : Oct 4, 2020, 8:56 AM IST

ఒకే కుటుంబం కుమారుడు, తండ్రి మరణించిన ఘటన నారాయణపేట జిల్లా మక్తల్ లో చోటుచేసుకుంది. ఇద్దరి మరణంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మెట్లపై నుంచి కిందపడి కుమారుడు.. గుండెపోటుతో తండ్రి
మెట్లపై నుంచి కిందపడి కుమారుడు.. గుండెపోటుతో తండ్రి

మెట్లపై నుంచి దిగుతూ కాలుజారి కిందపడి ఓ యువకుడు మృతిచెందిన ఘటన నారాయణపేట జిల్లా మక్తల్ లో చోటుచేసుకుంది. కుమారుడి మరణవార్త జీర్ణించుకోలేక తండ్రి గుండెపోటుతో చనిపోయారు. మక్తల్ వినాయక్ నగర్ లో జావిద్.. ఇంటి మేడపై చరవాణిలో ఆన్ లైన్ క్లాసులు విని మెట్ల ద్వారా కిందికి దిగుతుండగా కాలుజారి కింద పడ్డాడు.

తలకు బలమైన గాయం తగలగా.. చికిత్స నిమిత్తం మహబూబ్ నగర్ లోని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. ఇంటి దగ్గర ఉన్న తండ్రి అన్వర్... కొడుకు మరణ వార్త విని గుండెపోటుతో అక్కడికక్కడే మరణించారు. కుటుంబంలో ఇద్దరు చనిపోగా.. విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చదవండి : నేడు సివిల్​ సర్వీసెస్​ ప్రాథమిక పరీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.