ETV Bharat / jagte-raho

మరో గంట ప్రయాణం సాఫీగా సాగితే సందడి.. ఇంతలోనే..

author img

By

Published : Dec 10, 2020, 8:58 PM IST

three persons died in road accident at chillakallu
మరో గంట ప్రయాణం సాఫీగా సాగితే సందడి.. ఇంతలోనే..

మరో గంట ప్రయాణం సాఫీగా సాగితే శుభకార్యానికి వెళ్లేవారు. ఈలోగా అనుకోకుండా వచ్చిన ప్రమాదం ఆ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది. అనుకోని మృత్యువు ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది.

శుభకార్యానికి ముందు దైవ దర్శనం కోసం వెళ్లిన కుటుంబంపై విధి చిన్నచూపు చూసింది. కృష్ణా జిల్లా చిల్లకల్లు సమీపంలో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి తమ కారు ఢీకొనడంతో ఖమ్మం జిల్లా మధిరకు చెందిన మాచర్ల శ్యామ్, శారద, శ్యామల అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్ర గాయాలపాలయ్యారు.

మాచర్ల శ్యామల అనే మహిళ ఇటీవల నూతనంగా ఇల్లు నిర్మించుకుంది. శుక్రవారం రాత్రి గృహప్రవేశం. శనివారం బంధువులకు విందు ఏర్పాటు చేశారు. ఈలోగా కార్తీక మాసం సందర్భంగా వేములవాడ ఆలయానికి వెళ్లి స్వామిని దర్శించుకుని శుభకార్యం జరుపుకోవాలని భావించారు. వేములవాడ వెళ్లి తిరిగి వస్తుండగా మరో గంటలో స్వస్థలానికి చేరుకుంటారు. మార్గమధ్యలోనే ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

ఇదీ చూడండి: గంజాయి అక్రమ రవాణా ముఠా అరెస్టు.. 60 కేజీలు స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.