ETV Bharat / jagte-raho

విజయవాడలో సీసీ కెమెరాలకు చిక్కిన దొంగలు

author img

By

Published : Nov 22, 2020, 7:41 PM IST

theft-at-a-shop-in-vijayawada in AP
విజయవాడలో సీసీ కెమెరాలకు చిక్కిన దొంగలు

ఏపీలోని విజయవాడలో అర్ధరాత్రి గుర్తుతెలియని ముగ్గురు యువకులు ద్విచక్రవాహనంపై వచ్చి దొంగతనం చేస్తుండగా...సీసీ కెమెరాలకు చిక్కారు. నగరంలోని అజిత్ సింగ్ నగర్ పైపుల్ రోడ్ లోని ఓ పచారీ దుకాణంలో జరిగింది.

ఏపీలోని విజయవాడ అజిత్ సింగ్ నగర్ పైపుల్ రోడ్ ఓ పచారీ దుకాణంలో చోరీ జరిగింది. అర్ధరాత్రి గుర్తు తెలియని ముగ్గురు యువకులు ద్విచక్రవాహనంపై వచ్చి దుకాణం తాళం పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు.

షాపులోని కొంత మొత్తం నగదును దొంగతనం చేస్తుండగా...సీసీ కెమెరాలకు చిక్కారు. విషయం తెలుసుకున్న టూటౌన్ కొత్తపేట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని...సీసీ కెమెరాలను పరిశీలించారు. పాత నేరస్థులే ఈ దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించారు.

ఇదీ చూడండి:గ్రేటర్ ఎన్నికల్లో 52 స్థానాల్లో పోటీ చేస్తున్నాం: ఒవైసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.