ETV Bharat / jagte-raho

క్షణికావేశంలో భార్యను హతమార్చిన భర్త

author img

By

Published : Dec 20, 2020, 6:56 PM IST

the-husband-killed-his-wife-in-yadadri-bhuvanagiri-dist
క్షణికావేశంలో భార్యను హతమార్చిన భర్త

క్షణికావేశం నిండు ప్రాణాలను బలితీసుకుంది. భార్యభర్తల జరిగిన గొడవ ఇంటిదీపాన్నే ఆర్పేసింది. డబ్బుల కోసం భార్యతో తగాదా పడి... ఏకంగా ఆమె ఊపిరి తీసేశాడు భర్త. సైకిల్​ గాలిపంపుతో తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మహిళ మృతి చెందింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్​ నారాయణపురం మండలం చిల్లాపురం గ్రామంలో జరిగింది.

భార్యభర్తల మధ్య గొడవ కాస్తా ప్రాణాలమీదికి తెచ్చింది. క్షణికావేశం మహిళ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇద్దరు పిల్లలకు తల్లి ప్రేమను దూరం చేసింది. డబ్బులు ఇవ్వలేదని భార్యను సైకిల్​ పంపుతో తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్​ నారాయణపురం మండలం చిల్లాపురంలో ఈ ఘటన జరిగింది.

చిల్లాపురానికి చెందిన ఈశ్వర్​కు కేసారం గ్రామానికి చెందిన సంతోషతో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరిద్దరికి కుమారులు. భార్యభర్తల మధ్య తరచు గొడవలు జరుగుతుండేవి. పోలీసులు అతనికి చాలాసార్లు కౌన్సిలింగ్​ ఇచ్చినా ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు.

సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:పులిగుండాల ప్రాజెక్టులో ముగ్గురు యువకుల గల్లంతు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.