ETV Bharat / jagte-raho

అటవీశాఖ సిబ్బందిపై అర్ధరాత్రి సర్పంచ్ భర్త దాడి

author img

By

Published : Jun 4, 2020, 1:12 PM IST

అక్రమ నాపరాయి రవాణాను అడ్డుకున్న అటవీశాఖ సిబ్బందిపై కొంతమంది దాడికి పాల్పడ్డారు. ముదిమాణిక్యం గ్రామ సర్పంచ్ భర్త.. తన అనుచరులతో వచ్చి అటవీశాఖ సిబ్బందిపై కర్రలతో దాడి చేయించడాన్ని అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు.

సర్పంచ్ భర్త దాడి
సర్పంచ్ భర్త దాడి

నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం ముదిమాణిక్యంలో అక్రమ నాపరాయి రవాణాను అడ్డుకున్న అటవీశాఖ సిబ్బందిపై కొంతమంది దాడికి పాల్పడ్డారు. అటవీ సిబ్బంది బీట్ పెట్రోలింగ్‌లో భాగంగా తనిఖీలు నిర్వహించారు. రెండు ట్రాక్టర్లలో నాపరాయి తీసుకెళ్తున్న కొందిరిని అడ్డుకున్నారు.

ట్రాక్టర్లను స్టేషన్​కు తీసుకొని వెళ్తుండగా.. మార్గమధ్యంలో సర్పంచ్ భర్త తన అనుచరులతో వచ్చి అటవీశాఖ సిబ్బందిపై కర్రలతో దాడిచేశారు. ప్రాణభయంతో అక్కడి నుంచి తప్పించుకున్న అటవీశాఖ సిబ్బంది మిర్యాలగూడ ఆస్పత్రికి చేరుకుని చికిత్స తీసుకున్నారు.

ఇవీ చూడండి: మర్మాంగాన్ని కోసి భర్తను చంపేసింది..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.