ETV Bharat / jagte-raho

బైక్​ను ఢీకొట్టిన లారీ: ఒకరు మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు

author img

By

Published : Jul 17, 2020, 7:23 AM IST

one man died and one person injured in a road accident at mahabubanagr town
బైక్​ను ఢీకొట్టిన లారీ: ఒకరు మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు

మహబూబ్‌నగర్‌ పట్టణంలో రాత్రి రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. శివశక్తినగర్‌ సమీపంలో ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి ఓ లారీ ఢీ కొట్టింది.

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రాయిచూర్ నుంచి భూత్పూర్‌ వైపు వెళ్తున్న కర్ణాటకకు చెందిన లారీ... శివశక్తినగర్‌ సమీపంలో ముందు వెళ్తున్న బైక్​ను ఢీ కొట్టింది.

ఈ ఘటనలో పట్టణానికి చెందిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. సమాచారం తెలుసుకున్న 1వ పట్టణ పోలీసులు... ఘటనా స్థలానికి చేరుకున్న గాయపడ్డ వ్యక్తిని చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు.

ఇవీ చూడండి: పరీక్షలు పెంచండి.. ఈటలతో మజ్లిస్ ఎమ్మెల్యేలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.