ETV Bharat / jagte-raho

అబద్ధాలు చెప్పి మోసం చేశాడు... హత్య జరిగినట్లు నాటకమాడాడు

author img

By

Published : Nov 6, 2020, 7:12 PM IST

Updated : Nov 6, 2020, 7:48 PM IST

మాజీ ఆర్మీ అధికారినంటూ... సినిమాను తలపించే స్టైల్​లో ఓ వ్యక్తి... సాఫ్ట్​వేర్ ఉద్యోగినిని మోసం చేశాడు. ఈ ఘటన మల్కాజిగిరిలో చోటు చేసుకుంది. ఇంతకు నిందితుడు ఏమి చేశాడు. అతని బండారం ఎలా బయటపడింది?

man cheats a software employee in malkajgiri
అబద్ధాలు చెప్పి మోసం చేశాడు... హత్య జరిగినట్లు నాటకమాడాడు

మాజీ ఆర్మీ అధికారినంటూ సాఫ్ట్​వేర్ ఉద్యోగిని మోసం చేసిన ఆనందవర్ధన్ అనే వ్యక్తిని నార్సింగి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. మల్కాజి​గిరికి చెందిన ఆనందవర్ధన్... సాఫ్ట్​వేర్ ఉద్యోగినిని పరిచయం చేసుకున్నాడు. తనకు తానుగా మాజీ ఆర్మీ అధికారినంటూ నమ్మించాడు. ఎన్ఐఏ, రా, ఐబీకి ఏజెంట్​గా పనిచేస్తున్నట్లు సదరు మహిళను నమ్మించాడు.

ఇదివరకే వివాహమైందని, విడాకులు కూడా తీసుకున్నట్లు నమ్మించి... సాఫ్ట్​వేర్ ఉద్యోగినిని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమె ఇంట్లోని 50తులాల బంగారాన్ని చోరీ చేశాడు. దొంగలు బంగారు నగలు ఎత్తుకెళ్లారని నమ్మించి పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసినట్లు నకిలీ ఫిర్యాదు కాపీని మహిళకు చూపించాడు. పనిమీద గోవా వెళ్తున్నానని చెప్పి... అక్కడ హత్యకు గురైనట్లు నాటకాలాడాడు. ఈ మేరకు ఆర్మీ అధికారుల పేరుతో మహిళకు మెయిల్ చేశాడు. ఆనందవర్థన్​ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు ఆర్మీ అధికారుల పేరుతో ఆనంద్ మెయిల్ చేశాడు.

అనుమానం వచ్చిన మహిళ అక్టోబర్ 31వ తేదీ నార్సింగి పీఎస్​లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు... దర్యాప్తు చేపట్టి అతని నాటకాన్ని బయటపెట్టారు. ఆనంద్​ ఇలా ఎంతమంది మహిళలను మోసం చేశాడో తెలుసుకోవడానికి అతన్ని కస్టడీలోకి తీసుకుంటామని నార్సింగి సీఐ గంగాధర్ తెలిపారు.

ఇదీచూడండి: నాలుగో పెళ్లికి రిటైర్డ్​ ఉద్యోగి పత్రికా ప్రకటన.. పోలీసులను ఆశ్రయించిన మూడో భార్య..

Last Updated :Nov 6, 2020, 7:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.