ETV Bharat / jagte-raho

డేగల మడుగులో మాజీ మంత్రి కారు బోల్తా.. వాహనంలో నలుగురు

author img

By

Published : Jul 1, 2020, 8:35 AM IST

Updated : Jul 1, 2020, 8:59 AM IST

farmer-minister-ram-reddy-damodar-reddy-car-roll-at-degalamadugu-sujatha-nagar-mandal-bhadradri-district
మాజీ మంత్రి కారు ఫల్టీ.. త్రుటిలో తప్పిన పెనుప్రమాదం

మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. కారును ఎదురుగా వస్తున్న మరోకారు ఢీకొట్టింది. ఈ ఘటన డేగలమడుగులో చోటుచేసుకుంది.

మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి కారు ప్రమాదానికి గురైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్​ మండలం డేగలమడుగు వద్ద ఈ ప్రమాదం జరిగింది. రాంరెడ్డి ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టడంతో బోల్తా కొట్టింది. గ్రామస్తులు కారులోని వాళ్లను బయటికి తీశారు. అదృష్టవశాత్తు కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. మరో కారులోని వ్యక్తికి కూడా ఎటువంటి గాయాలు కాలేదు.

ఇదీ చూడండి: కేబినెట్‌ భేటీపై నేడు నిర్ణయం.. లాక్‌డౌన్‌పై చర్చ!

Last Updated :Jul 1, 2020, 8:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.