ETV Bharat / jagte-raho

ధర్మపురి దర్శనానికి వెళ్లొస్తుండగా ప్రమాదం.. 8 మందికి గాయాలు

author img

By

Published : Jan 19, 2021, 2:48 PM IST

eight people injured when an auto hits a tree at metpally
మెట్​పల్లిలో దైవ దర్శనం నుంచి వెళ్తుండగా ప్రమాదం

జగిత్యాల జిల్లా ధర్మపురి నర్సింహస్వామి దర్శనానికి వెళ్లి తిరిగివస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో నవవరుడు సహా ఏడుగురు గాయపడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

జగిత్యాల జిల్లా మెట్​పల్లి మండలం అరపేట సమీపంలోని జాతీయ రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లా గోపన్​పల్లి వాసులు ఆటోలో.. ధర్మపురి నర్సింహస్వామి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా.. అరపేట శివాలయం మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి చెట్టును ఢీకొట్టారు.

ఈ ప్రమాదంలో ఆటోలో ముందు కూర్చున్న నవ వరుడు క్యాబిన్​లో ఇరుక్కుపోగా.. స్థానికులు అతణ్ని బయటకు తీశారు. డ్రైవర్ సహా గాయపడిన ఎనిమిది మందిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.